న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ, ప్రభుత్వం ఈఎంఐపై మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే మారటోరియం కాలానికి గాను బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి. దీనిపై ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మారటోరియం కాలానికి గాను ఆ తర్వాత వసూలు చేసే వడ్డీ మాఫీ చేయాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

వడ్డీని వసూలు చేయాల్సిందేనని ఆర్బీఐ
మారటోరియం కాలానికి గాను రుణంపై వడ్డీని మాఫీ చేయాలన్న పిటిషనర్ వాదనతో ఆర్బీఐ విబేధించింది. బ్యాంకుల ఆర్థిక సాధికారతను పక్కన బెట్టి వడ్డీని వసూలు చేయకూడదని చెప్పడం సరికాదని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. అదే సమయంలో మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ భారంపై జూన్ 12వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆర్థికమంత్రిత్వ శాఖకు సూచించింది సుప్రీం కోర్టు.

రెండు సూచనలు చేసిన సుప్రీం కోర్టు
మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ రద్దుతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఆర్బీఐ తెలిపింది. ఈ వ్యవహారంలో రెండు అంశాలను పరిశీలిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయకపోవడం, వడ్డీపై వడ్డీ విధించకపోవడం పరిశీలించాలని తెలిపింది.

ఓవైపు ఉపశమనం అంటూ మరోవైపు వసూలు
ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చర్చనీయాంశమైన అంశమని, ఓ వైపు మారటోరియం వెసులుబాటు కల్పిస్తూ మరోవైపు పేరుకుపోయిన ఈఎంఐలపై వడ్డీని వసూలు చేస్తున్నారని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థిక అంశాలు ముఖ్యం కాదని తెలిపింది. ఆర్బీఐ ఇచ్చే సమాధానం ముందే మీడియాకు లీక్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఆర్బీఐ మొదట మీడియాకు, ఆ తర్వాత కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుందా అని ప్రశ్నించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications