ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం మార్చి 31 వరకు పొడిగింపు: MSME,ముద్రా, ఇండివిడ్యువల్స్‌కు..

ఎస్ఎంఎస్ఈలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ECLGS)ను మార్చి 31, 2021 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ స్కీంకు ఎంఎస్ఎంఈ యూనిట్లు, ముద్రా లోన్ రుణగ్రహీతలు, బిజినెస్ ఎంటర్‌ప్రైజెస్, బిజినెస్ ఇండివిడ్యువల్ లోన్స్ వంటివి ఈ స్కీంకు అర్హత కలిగినట్లు చెప్పారు. 39.7 లక్షల ట్యాక్స్‌పేయర్స్‌కు రూ.1,32,800 కోట్ల ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్స్ చెల్లించినట్లు నిర్మల తెలిపారు. ఒత్తిడిలో కూరుకుపోయిన రంగాలను గుర్తించి క్రెడిట్ మద్దతు ఇస్తామని తెలిపారు. ఒత్తిడిలో కూరుకుపోయిన రంగాలను కామత్ కమిటీ సూచించిందన్నారు.

కామత్ కమిటీ గుర్తించిన ఒత్తిడిలో కూరుకుపోయిన వివిధ రంగాలకు క్రెడిట్ మద్దతు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కరోనా కారణంగా 26రంగాలు భారీగా దెబ్బతిన్నట్లు కామత్ కమిటీ గుర్తించిందని తెలిపారు. ఇందులో హెల్త్ కేర్ సెక్టార్ కూడా ఉందన్నారు. ఈ పథకం కింద అదనపు క్రెడిట్ కాలపరిమితి 5 ఏళ్లుగా తెలిపారు.

Emergency Credit Line Guarantee Scheme for MSMEs, MUDRA borrowers, individuals extended till March

ఈ పథకంలో ప్రిన్సిపుల్ అమౌంట్ తిరిగి చెల్లించే కాలపరిమితిపై ఏడాది పాటు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ స్కీం మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ పథకం అర్హత కోసం టర్నోవర్ పరిమితి లేదని తెలిపారు. 10 రంగాలకు ఆత్మనిర్భర్ భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీం లాంచ్ చేసినట్లు తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+