Elon Musk: దేశంలో ఎన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి విక్రయిస్తున్నప్పటికీ.. టెస్లా కొనుక్కోవాలనేది చాలా మంది ఆకాంక్ష. అయితే మస్క్ దీనిని ఎప్పుడు ఇండియాలోకి ప్రవేశపెడతారా అని వేచిచూస్తున్నారు.
ఈ క్రమంలో గత నెల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత.. పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. దేశంలో టెస్లా గిగాఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు బయటకు వచ్చాయి. చర్చలు సఫలీకృతం అయితే.. త్వరలోనే టెస్లా కార్లు భారతీయ రోడ్లపై పరుగులు తీయవచ్చని తెలుస్తోంది.

ఏటా 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయగల సామర్థ్యంతో దేశంలో ఒక గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు టెస్లా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. అసలు ఇండియాలో ప్లాంట్ను ఏర్పాటు చేయాలా..? వద్దా..? అని టెస్లా కొన్నేళ్లుగా ఆలోచిస్తోంది. అయితే ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఇక్కడ తయారు చేసి ఎగుమతి చేసేందుకు ఉన్న సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని మస్క్ టీమ్ చర్చలను ముందుగు తీసుకెళుతోందని వెల్లడైంది.
ప్రస్తుతం టెస్లా అతిపెద్ద ప్లాంట్ చైనాలో దాదాపు 7,50,000 యూనిట్ల వార్షిక కార్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇదే క్రమంలో ఆపిల్, శామ్సంగ్ వంటి టెక్ కంపెనీలు చైనా ప్రభుత్వ కఠిన ఆంక్షల నేపథ్యంలో ఏర్పడుతున్న ఉత్పత్తి నష్టాలను తగ్గించుకునేందుకు, ఇతర ప్రాంతాల్లో అమ్మకాలను మెరుగుపరుచుకునేందుకు తమ ఫ్యాక్టరీలను ఇతర దేశాలకు తరలిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఇదే దారిలో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
గత నెలలో అమెరికాలో టెస్లా సీఈవోతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అనంతరం ఈ చర్చలు జరగటం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చర్చలు ఫలవంతమైతే కంపెనీ తన కార్లను రూ.20 లక్షలకు అందుబాటులోకి తీసుకురావచ్చని తెలుస్తోంది. మస్క్ యాజమాన్యంలోని టెస్లా ఇండియాలో ఆటోమోటివ్ విడిభాగాల కోసం దాని స్వంత సరఫరా గొలుసును ఏర్పాటు చేయాలనుకుటోంది. ఇదే క్రమంలో భారత్ లో ప్లాంట్ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications