టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ సోదరుడు కింబాల్ మస్క్ 25.6 మిలియన్ డాలర్ల తన షేర్లను విక్రయించారు. అతను ఎలాన్ సోదరుడు మాత్రమే కాకుండా టెస్లా ఇంక్ బోర్డు మెంబర్ కూడా. ఈ ఎలక్ట్రిక్ కార్మేకర్ సంస్థలో భారీ మొత్తంలో షేర్లను విక్రయించారు. ఈ మేరకు యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్కు ఇచ్చిన ఫైలింగ్లో తెలిపారు. టెస్లా షేర్లు గత ఏడాది కాలంలో భారీ ఎత్తున ఎగిసిన విషయం తెలిసిందే. దీంతో ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు.

30వేల షేర్ల విక్రయం
48 సంవత్సరాల కింబాల్ మస్క్ ఫిబ్రవరి 9వ తేదీన 30,000 షేర్లను విక్రయించారు. సగటున 852.12 డాలర్లకు వీటిని విక్రయించినట్లు రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్లో తెలిపారు. 2020 క్యాలెండర్ ఏడాదిలో టెస్లా షేర్లు 743 శాతం ఎగిశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 14 శాతం లాభపడ్డాయి. అయితే బుధవారం మాత్రం 5.3 శాతం మేర క్షీణించి 804.52 డాలర్లకు పడిపోయింది.

మరొకరు కూడా
కింబాల్ మస్క్ ఈ సంస్థలో తన షేర్లను విక్రయించడంతో అతని షేర్లు 599,740కి తగ్గాయి. వీటి వ్యాల్యూ 483 మిలియన్ డాలర్లుగా ఉంది. సమాచారం మేరకు టెస్లా ఇంక్లో ఇన్సైడర్స్ 19.6 శాతం వాటాను కలిగి ఉన్నారు. కింబాల్ మస్క్తో పాటు మరో బోర్డు మెంబర్ ఆంటోనియో గ్రేసియాస్ కూడా 150,74 షేర్లను విక్రయించారు. కంపెనీలో అతను 2545 స్టాక్ హోల్డింగ్ కలిగి ఉన్నాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విక్రయించినట్లుగా తెలుస్తోంది. దీనిని లాంగ్ టర్మ్ ఈక్విటీ యాంటిసిపేషన్ సెక్యూరిటీస్ అని పిలుస్తారు. గ్రేసియాస్ జూన్ 2022, 2025 కాల్ ఆప్షన్ ఎక్స్పైరింగ్తో 150000 కొనుగోలు చేశాడు. పరోక్షంగా అతను ఏజేజీ గ్రోత్ ఫండ్ ద్వారా 1.3 మిలియన్ల టెస్లా షేర్స్ కలిగి ఉన్నాడు.

ది కిచెన్ రెస్టారెంట్ గ్రూప్ సీఈవో
కింబాల్ మస్క్... ది కిచెన్ రెస్టారెంట్ గ్రూప్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కో ఫౌండర్గా ఉన్నారు. గ్రేసియాస్ వాలోర్ ఈక్విటీ పార్ట్నర్స్ ఫౌండర్. కాగా, గ్లోబల్ విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా యాజమాన్యం 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. బిట్ కాయిన్లో అత్యధిక పెట్టుబడులు పెట్టిన సంస్థగా టెస్లా నిలిచింది. బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో టెస్లా తెలిపింది. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ 16 శాతం పెరిగి 45 వేల డాలర్లకు చేరుకుంది. తమ సంస్థ విద్యుత్ కార్ల చెల్లింపుల కోసం డిజిటల్ కరెన్సీని అంగీకరించనున్నట్లు టెస్లా తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications