Elon Musk: AI విభాగం వైపు ఎలాన్ మస్క్ అడుగులు.. ChatGPTకి పోటీగా రానున్న TruthGPT
Elon Musk: అపర కుబేరుడు, టెస్లాతో పాటు ట్విట్టర్ అధినేతగా ఎలాన్ మస్క్ అందరికీ సుపరిచితమే. తాజాగా ఆయన కన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పడింది. ఇప్పటికే మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ChatGPTకి పోటీగా TruthGPT పేరిట ఓ AI ఆధారిత వ్యవస్థను రూపొందించనున్నట్లు చెప్పి ప్రపంచానికి షాక్ ఇచ్చారు. మానవ వినాశనం నివారణ కోసం AI సృష్టికి ప్రత్యామ్నాయం అవసరమని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మేము తయారుచేయనున్న AI వ్యవస్థను 'TruthGPT'గా పిలుస్తాను. విశ్వం స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించే సత్యాన్వేషిగా దీనిని భావిస్తున్నాను. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో శ్రద్ధ వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మానవులను నాశనం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇది భద్రతకు ఉత్తమ మార్గం అని భావిస్తున్నాను. ఎందుకంటే మనమూ విశ్వంలో ఓ ప్రముఖ భాగమే" అని మస్క్ అభిప్రాయపడ్డారు.

ఫిబ్రవరిలో మొదటిసారిగా మనకు కావలసినది TruthGPT అని మస్క్ ట్వీట్ చేశారు. ChatGPT విపరీతంగా ప్రజలను ఆకట్టుకున్నవేళ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రోత్సహించే X.AI అనే కొత్త కంపెనీని నెలకొల్పారు. ఈ సంస్థ టెక్సాస్ లోని నెవాడాలో లిస్ట్ చేయబడింది. దీనికి మస్క్ డైరెక్టర్ గా, ఆయన ఫ్యామిలీ ఆఫీస్ డైరెక్టర్ జారెడ్ బిర్చాల్ సెక్రటరీగా ఉన్నారు. దీని ప్రకటన సందర్భంగా ఆయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుంది.
మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన OpenAIకి పోటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థను సృష్టించడం మస్క్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ChatGPT, GPT-4లు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. యాపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ వోజ్నియాక్ సహా పలువురు అగ్రశ్రేణి వ్యవస్థాపకులు, AI పరిశోధకులు బహిరంగ లేఖ రాశారు. అన్ని AI ల్యాబ్ లు GPT-4 కంటే శక్తివంతమైన AI సిస్టమ్స్ శిక్షణను కనీసం 6 నెలల పాటు వెంటనే ఆపేయాలని అందులో కోరడం విశేషం.


Click it and Unblock the Notifications