Twitter Blue: ట్విట్టర్ కంపెనీని కొనుగోలు చేయాలని ఎలాన్ మస్క్ నిర్ణయించినప్పటి నుంచి అనేక సంచలనాలు జరిగాయి. చివరికి మస్క్ కంపెనీ ఉద్యోగులను భారీగా తొలగించటం, ఆఫీసులకు కనీసం అద్దె చెల్లించకపోవటం లాంటి తీవ్ర పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఖాతాదారులను సబ్ స్క్రిప్షన్ కొనుగోలు చేసేందుకు ఆకర్షనీయమైన ఆఫర్ తో వచ్చారు.

సంచలన నిర్ణయం..
Twitter బ్లూ సబ్స్క్రిప్షన్ను కలిగి ఉండటం వల్ల ఖాతాదారులు డబ్బును సంపాదించే ప్రయోజనాన్ని ఎలాన్ మస్క్ తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజం ఇప్పుడు తమ రిప్లై థ్రెడ్ ద్వారా వచ్చే ప్రకటన ఆదాయంలో కొంత భాగాన్ని చందాదారులకు చెల్లిస్తుందని CEO ఎలోన్ మస్క్ వెల్లడించారు. ప్రత్యుత్తర థ్రెడ్లలో కనిపించే ప్రకటనల కోసం క్రియేటర్లతో ప్రకటన ఆదాయాన్ని పంచుకుంటుందని మస్క్ వెల్లడించారు. ఈ యాడ్ రెవెన్యూ పొందటానికి ముందుగా ఖాతాదారులు Twitter బ్లూ వెరిఫైడ్కు సబ్స్క్రైబర్ అయి ఉండాలి.
భారతీయులకు వర్తిస్తుందా..?
ట్విట్టర్ అధికారిక వెబ్సైట్ లోని సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఈనెల 3న ప్రకటించిన రెవెన్యూ షేరింగ్ ఆఫర్ కొన్ని దేశాలకు మాత్రమే అందుబాటులో ఉంది. వివరాల ప్రకారం అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, పోర్చుగల్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అంటే ప్రస్తుతం ఈ ఆఫర్ భారతీయ ట్విట్టర్ బ్లూ సబ్స్క్రైబర్లకు అందుబాటులో లేదని తెలుస్తోంది.

త్వరలో ఇండియాకు..
ప్రస్తుతానికి ట్విట్టర్ బ్లూ సేవలు ఇండియాలో లేనప్పటికీ రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. అప్పుడు ఇక్కడి యూజర్లకు సైతం ప్రకటనల ఆదాయాన్ని పొందే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. దీనికి తోడు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్విట్టర్ ఇటీవల ట్వీట్ ఎడిట్ ఆప్షన్, ట్వీట్ ఒపీనియన్ రద్దు చేయటం, బుక్మార్క్ ఫోల్డర్లు, పొడవైన వీడియోల అప్లోడ్, 'స్పేసెస్' ట్యాబ్ వంటి అనేక ఇతర ప్రత్యేక లక్షణాలను తన సేవల్లో జోడించింది.

ట్విట్టర్ గోల్డ్ విషయంలో..
ట్విట్టర్ బ్లూ మాదిరిగా వ్యాపారుల కోసం ట్విట్టర్ గోల్డ్ బ్యాడ్జ్ అందిస్తోంది. అయితే దీనిని పొందటానికి నెలకు వారు 1000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులకు ట్విట్టర్ చెప్పింది. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు 85,000 రూపాయలు కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గోల్డ్ టిక్ మార్క్ ఉన్న ఎవరైనా కంపెనీ నిర్ణయించిన రుసుము చెల్లించక పోతే చివరికి బ్యాడ్జ్ను కోల్పోతారు. అయితే ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాల్సిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications