అమెరికాకు చెందిన ప్రపంచ ప్రముఖ ఔషధ తయారీ దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Co.) భారతదేశంలో తన ప్రస్థానాన్ని కొత్తగా ప్రారంభించబోతోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లకు పైగా) పెట్టుబడిని భారత ఫార్మా రంగంలో పెట్టాలని కంపెనీ ప్రకటించింది. దీని ప్రధాన లక్ష్యం కీలక ఔషధాల తయారీ సామర్థ్యాన్ని విస్తరించడం, గ్లోబల్ సరఫరా గొలుసును బలోపేతం చేయడంగా చెప్పవచ్చు.
ఈ పెట్టుబడిలో భాగంగా ఎలీ లిల్లీ హైదరాబాద్లో ఒక కొత్త తయారీ, నాణ్యత హబ్ (Manufacturing & Quality Hub)ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం స్థానిక కాంట్రాక్ట్ తయారీదారులతో కలిసి ఉత్పత్తి ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. దీనికి సంబంధించిన నియామకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇంజనీర్లు, రసాయన శాస్త్రవేత్తలు, విశ్లేషక శాస్త్రవేత్తలు, నాణ్యత నిపుణులు కోసం ఉద్యోగ అవకాశాలు తెరవబడ్డాయి.

కంపెనీ ప్రకటనలో తెలిపినట్లుగా.. హైదరాబాద్ హబ్ తన ప్రపంచ తయారీ నెట్వర్క్లో కీలక భాగంగా ఉంటుంది. ఇది మధుమేహం (Diabetes), ఊబకాయం (Obesity), అల్జీమర్స్, క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల కోసం మందుల స్థిరమైన సరఫరాను మరింతగా పెంచనుంది. ఎలీ లిల్లీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పాట్రిక్ జాన్సన్ మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా మా తయారీ సామర్థ్యాన్ని పెంచడం మా వ్యూహాత్మక ప్రాధాన్యతగా చెప్పుకోవచ్చు. భారతదేశం ఈ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆయన ఈ పెట్టుబడి ప్రపంచ స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, కంపెనీ యొక్క అభివృద్ధి చెందుతున్న ఔషధ పోర్ట్ఫోలియోకు దీర్ఘకాలిక మద్దతు ఇస్తుందని వివరించారు.
ఈ నిర్ణయం మౌంజారో (Mounjaro) అనే ఎలీ లిల్లీ బరువు తగ్గించే, మధుమేహ ఔషధం భారతదేశంలో ప్రారంభమైన కొద్ది నెలల తరువాత వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి భారీ డిమాండ్ ఉంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..ఈ పెట్టుబడి కంపెనీకి దీర్ఘకాలిక సరఫరా స్థిరత్వాన్ని కల్పిస్తుంది. స్థూలకాయ చికిత్సల మార్కెట్లో పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
భారత ప్రభుత్వ, రాష్ట్ర స్థాయి ప్రతిస్పందనలు కూడా సానుకూలంగా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ..హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ మ్యాప్లో కీలక కేంద్రంగా మారిందని తెలిపారు. పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సాంకేతికత ఆధారిత వృద్ధి, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడం ద్వారా తెలంగాణ బహుళజాతి కంపెనీలకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని తెలిపారు.
ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ నివృతి రాయ్ ఈ నిర్ణయాన్ని భారతదేశాన్ని గ్లోబల్ ఫార్మా కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దే మరో ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. 2020 నుండి ఎలీ లిల్లీ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి విస్తరణకు 55 బిలియన్ డాలర్లకు కట్టుబడి ఉంది. ఇందులో అమెరికా, యూరప్, ఆసియా కేంద్రాలు ఉన్నాయి. భారత పెట్టుబడి ఆ విస్తరణకు వ్యూహాత్మక కొనసాగింపుగా ఉండి, దేశాన్ని లిల్లీ గ్లోబల్ సరఫరా గొలుసులో కీలక లింక్గా మార్చే ప్రయత్నంగా కంపెనీ భావిస్తోంది. ఈ పెట్టుబడి భారత్ ఫార్మా రంగానికి భారీ ప్రోత్సాహం ఇవ్వడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Financial planning: మెడికల్ బిల్లుల భయం పోవాలంటే.. మీ పేరెంట్స్ కోసం ఇప్పుడే ఈ పనులు చేయండి!

Lumpsum calculator: లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఈ కాలిక్యులేటర్ వాడితే లాభాలు పక్కా!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications