For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారంలోనే పదింట 8 కంపెనీల రూ.1.37 లక్షల కోట్ల సంపద ఆవిరి, రిలయన్స్‌కు భారీ షాక్

|

కరోనా మహమ్మారి కారణంగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ వైరస్ ప్రభావం తగ్గుతుందనే సంకేతాలు ఉన్నప్పుడల్లా కాస్త కోలుకుంటున్నాయి. గత వారం కరోనా వల్ల మన దేశంలోని టాప్ 10 కంపెనీల్లోని 8 కంపెనీల ఆస్తులు పెద్ద ఎత్తున కరిగిపోయాయి. చమురు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిలయన్స్ ఎక్కువగా నష్టపోయింది. గత వారం 8 కంపెనీల మార్కెట్ వ్యాల్యూ ఏకంగా రూ.1,37,311.31 కోట్ల మేర తగ్గింది.

కొత్త పన్ను వేస్తాం: ఆపిల్ చైనా నుండి భారత్ రాకుండా ట్రంప్ బెదిరింపులు!కొత్త పన్ను వేస్తాం: ఆపిల్ చైనా నుండి భారత్ రాకుండా ట్రంప్ బెదిరింపులు!

ఈ రెండు మాత్రమే లాభపడ్డాయి

ఈ రెండు మాత్రమే లాభపడ్డాయి

గత వారంలో లాభపడిన కంపెనీల్లో కేవలం భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ మాత్రమే ఉన్నాయి. మిగతా ఎనిమిది కంపెనీల ఆస్తులు తగ్గిపోయాయి. భారతీ ఎయిర్ టెల్ ఆస్తులు గత వారం 13,147.89 జత కలిసి కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.3,02,292.43 కోట్లుగా నిలిచింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.7,744.11 పెరిగి రూ.2,02,330.13 కోట్లకు పెరిగింది.

ఏ కంపెనీ ఆస్తి ఎంత తరిగింది.. ఎం-క్యాప్ ఎంత

ఏ కంపెనీ ఆస్తి ఎంత తరిగింది.. ఎం-క్యాప్ ఎంత

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తులు రూ.65,232.46 కోట్ల మేర కరిగిపోయి కంపెనీ ఎం-క్యాప్ రూ.9,24,855.56గా నిలిచింది. HDFC బ్యాంకు సంపద రూ.22,347.07 కోట్లు కరిగిపోయి రూ.4,87,083.88 కోట్లుగా, హిందూస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ సంపద రూ.13,192.26 కోట్లు కరిగిపోయి రూ.4,77,458.89 కోట్లుగా, ICICI బ్యాంకు సంపద రూ.9,770.06 కోట్లు తగ్గి రూ.2,08,900.79 కోట్లుగా, ఇన్ఫోసిస్ ఆస్తులు రూ.9,518.84 తగ్గి రూ.2,77,814.09 కోట్లుగా, HDFC ఆస్తులు రూ.9,370.38 తగ్గి రూ.2,83,293.70 కోట్లుగా ఉంది. కొటక్ మహీంద్రా బ్యాంకు సంపద రూ.7,805.2 కోట్లు తగ్గి ఎం-క్యాప్ రూ.2,25,327.22 కోట్లుగా ఉంది.

రిలయన్స్ టాప్

రిలయన్స్ టాప్

టాప్ 10 కంపెనీల్లో ర్యాంకింగ్స్ విషయానికి వస్తే... అత్యధిక ఎం-క్యాప్ కలిగిన సంస్థగా రిలయన్స్ స్థానం నిలుపుకుంది. ఆ తర్వాత టీసీఎస్, HDFC బ్యాంకు, ఎయిర్ టెల్, HDFC, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ, ఐటీసీ ఉన్నాయి. గత వారంలో సెన్సెక్స్ 545 పాయింట్ల మేర నష్టపోయింది.

English summary

వారంలోనే పదింట 8 కంపెనీల రూ.1.37 లక్షల కోట్ల సంపద ఆవిరి, రిలయన్స్‌కు భారీ షాక్ | Eight of top 10 Indian firms lose Rs 1.37 trillion in m cap

Eight of the 10 most valued domestic firms suffered a combined erosion of ₹1,37,311.31 crore in market valuation last week, with Reliance Industries (RIL) taking the biggest knock.
Story first published: Sunday, May 17, 2020, 20:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X