Byjus Salary: భారత స్టార్టప్ కంపెనీల్లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలుగా గుర్తింపు తెచ్చుకున్న సంస్థలు సైతం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. సీఈవో రాజీనామా చేసిన తర్వాత ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.
అవును బైజూస్ సంస్థ గత కొన్ని నెలలుగా సమయానికి ఉద్యోగులకు వేతనాలు చెల్లించటంలో సైతం విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టార్టప్ యాజమాన్యం కొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. కంపెనీని తిరిగి గాడినపెట్టే క్రమంలో ఉద్యోగులకు వేతన నిర్మాణాన్ని సవరించింది. కరోనా సమయంలో ఒక వెలుగు వెలిగిన స్టార్టప్ విచ్చలవిడిగా విస్తరణకు, బ్రాండింగ్ కోసం డబ్బును ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్వెస్టర్లతో కొనసాగుతున్న చట్టపరమైన వివాదాలు కంపెనీకి నిధుల కొరతను కల్పించాయి. దీంతో గత కొన్ని నెలలుగా బైజూస్ ఆర్థిక ఆరోగ్యం బాగా క్షీణించింది.

దీంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గత జనవరి నుంచి బైజూస్ తన ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వలేదు. కొన్ని నెలల కిందట వ్యవస్థాపకుడు బైజూ రవీంథ్రన్ ఏకంగా తన ఇంటిని సైతం జీతాల చెల్లింపుల కోసం తాకట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానంలో బైజూస్ కంపెనీ పెద్ద మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం కంపెనీ సేల్స్ డిపార్ట్మెంట్, ఎగ్జామ్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్కు చెందిన ఉద్యోగులకు రెవెన్యూ లింక్డ్ శాలరీ ప్రవేశపెట్టబడింది. అంటే వారంవారీ సంపాదన ఆధారంగా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని కంపెనీ చెప్పింది.
కంపెనీ తీసుకొచ్చిన కొత్త వేతన పాలసీ ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చినట్లు సమాచారం. ఇకపై సేల్స్ ప్రతినిధుల ఆదాయం ఆ వారంలో వారు చూపించే సేల్స్ రేటు ప్రకారం ఉంటుంది. అంటే వీక్లీ సేల్స్ రేటులో 50% చొప్పున జీతం చెల్లిస్తామని, ఈ జీతం వారానికోసారి చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులకు బైజూస్ ప్రాథమిక వేతనాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. వారంవారీ సంపాదన ఆధారంగా జీతం చెల్లించనున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరణ ఇచ్చింది. అంటే ఈ వారంలో ఎలాంటి సేల్స్ రాని ఉద్యోగులకు జీతం కూడా లభించదని బైజూస్ తెలిపింది.
కొత్త పే స్కేల్ ఒక వ్యక్తి కంపెనీకి ఆదాయాన్ని ఎలా తెస్తున్నారు. జట్టులో ఆ వ్యక్తి స్థానం ఏమిటి. ప్రతి బృందంలోని సేల్స్ ప్రతినిధుల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడుతుంది. కంపెనీ వేతన పాలసీని వారానికోసారి చెల్లింపులోకి తీసుకురావటం వల్ల.. నెలవారీ జీతంపై తమకు లభించిన ఇతర ప్రయోజనాలను పొందలేక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పనితీరు ఆధారిత ఆదాయం తమపై మరింత ఒత్తిడి తెస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications