Byju's CEO Resign: దేశంలోనే అతిపెద్ద ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీగా పేరొందిన బైజూస్ రోజురోజుకూ కొత్త కష్టాల్లోకి నెట్టబడుతోంది. అంతర్గతంగా పరిస్థితులు దిగజారటంతో ఉన్నత స్థాయి నాయకత్వం సైతం కంపెనీని వీడుతోంది.
ఈ క్రమంలోనే బైజూజ్ సీఈవో అర్జున్ మోహన్ బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలలకే తన పదవికి రాజీనామా చేయటం సంచలనంగా మారింది. దీంతో స్టార్టప్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రోజువారీ కార్యాచరణ బాధ్యతలను పునఃప్రారంభించారని కంపెనీ ఏప్రిల్ 15న ప్రకటన ద్వారా వెల్లడించింది. మోహన్ బాహ్య సలహాదారు పాత్రకు మారనున్నారని తెలిపింది.

గతంలో కంటే బైజూస్ వ్యాపారం తగ్గినందున, బైజు రవీంద్రన్ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉన్నందున, ఇతర అవకాశాల కోసం తాను తప్పుకుంటున్నట్లు అర్జున్ మోహన్ స్పష్టం చేశారు. మనోధైర్యానికి మంచిదని చెప్పారు. దీంతో నాలుగేళ్ల విరామం తర్వాత రవీంద్రన్ మళ్లీ బాధ్యతల్లోకి వస్తున్నారు. సీఈవో రాజీనామాపై స్పందించిన బైజు రవీంద్రన్ కంపెనీ సవాళ్లలో ఉన్న కాలంలో అర్జన్ BYJU's స్టీరింగ్లో అత్యుత్తమ పనిచేశాడని అన్నారు. తాము అర్జున్ నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతూ వ్యూహాత్మక సలహాదారుగా నిరంతర సహకారాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
ఇలాంటి సవాలు వ్యాపార వాతావరణంతో పాటు ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కంపెనీ తన కార్యకలాపాలను మూడు విభాగాల కింద కుదించాలని నిర్ణయించింది. దీని ప్రకారం బైజూస్ ఆపరేషన్స్.. ది లెర్నింగ్ యాప్, ఆన్లైన్ క్లాసులు & ట్యూషన్ సెంటర్స్, టెస్ట్ ప్రిపరేషన్ అనే మూడు విభాగాలుగా ఏకీకృతం చేస్తోంది. ఈ యూనిట్లలో ప్రతి ఒక్కటి ప్రత్యేక నాయకులను కలిగి ఉంటుంది. వారు సంస్థ తీవ్రమైన నగదు కొరత సమస్యలతో పోరాడుతూనే ఉన్నందున లాభదాయకతను నిర్ధారించడానికి వ్యాపారాలను స్వతంత్రంగా నిర్వహిస్తారు.
ఈ పునర్వ్యవస్థీకరణ BYJU'S 3.0 ప్రారంభాన్ని సూచిస్తుందని రవీంద్రన్ తెలిపారు. ముఖ్యంగా హైపర్-పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ రంగంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ డైనమిక్స్కు త్వరగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న చురుకైన సంస్థ అని రవీంద్రన్ చెప్పారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications