మణప్పురం ఫైనాన్స్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. మార్కెట్లో కుప్పకూలిన స్టాక్..!

Manappuram Finance: కేరళ కేంద్రంగా వ్యాపారాలను నిర్వహిస్తోంది మణప్పురం ఫైనాన్స్ సంస్థ. అయితే మనీలాండరింగ్ ఆరోపణలతో కంపెనీ ఆఫీసుల్లో నేడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధంగా కంపెనీ రూ.150 కోట్లకు పైగా పబ్లిక్ డిపాజిట్లను సేకరించిందన్న ఆరోపణల నేపథ్యంలో దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కేరళలోని త్రిసూర్ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రమోటర్లకు సంబంధించిన మెుత్తం నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

ED raided premises of Manappuram Finance in kerala on RBI rules violation charges, Shares tanked

ఈ క్రమంలో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్న ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించటంపై మణప్పురం ఫైనాన్స్ వివరణ ఇచ్చింది. డిపార్ట్‌మెంట్‌కు తమ పూర్తి సహాయాన్ని అందజేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్లప్పుడూ కార్పోరేట్ గవర్నెన్స్, అత్యుత్తమ విధానాలకు కట్టుబడి ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రధానంగా RBI అనుమతి లేకుండా ప్రజల నుంచి రూ.150 కోట్లకు పైగా డిపాజిట్లను అక్రమంగా సేకరించారని ఈడీ ఆరోపించింది. ఇందులో భాగంగా కేవైసీ నిబంధనలను పాటించకుండా పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారనే కోణంలో తాజా సోదాలు జరిగాయని తెలుస్తోంది. కంపెనీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మణప్పురం షేర్లు మార్కెట్లో భారీగా నష్టపోయాయి. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ఎన్ఎస్ఈలో 12.22 శాతం నష్టపోయి రూ.113.85 వద్ద ట్రేడింగ్ ముగించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+