Banking News: భూషణ్ స్టీల్ కేస్ అప్‌డేట్.. 56 వేల కోట్ల ఫ్రాడ్‌.. కీలక ముందడుగు..

Bhushan Steel case: బ్యాంకులను మోసం చేసి జనాల సొమ్ము దోచేస్తున్న బడా బాబులు దేశంలో ఎక్కువైపోయారు. ఈ కోవకి చెందిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తరహా వ్యక్తులు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మరికొందరిని మాత్రం మన ఏజెన్సీలు పట్టుకుని విచారణ జరుపుతున్నాయి.

భూషణ్ స్టీల్ (BSL) మాజీ ప్రమోటర్లు 56 వేల కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. వారిలో కంపెనీ మాజీ బ్యాకింగ్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ కుమార్ తివారీ, అకౌంట్స్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ కుమార్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నితిన్ జోహ్రీ, ప్రమోటర్ నీరజ్ సింగల్ బావ అజయ్ మిట్టల్ ఉన్నారు. వీరితో పాటు అజయ్ మిట్టల్ భార్య నీరజ్ సింగల్ మరియు సోదరి అర్చన మిట్టల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ED arrested 5 persons in Bhushan Steel bank fraud case

మాజీ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ సింగల్ తన సహచరులతో కలిసి అనేక షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తమ విచారణలో తేలిందని దర్యాప్తు సంస్థ తెలిపింది. చైన్ సిస్టమ్ ద్వారా ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి నిధులను మారుస్తూ వచ్చినట్లు గుర్తంచామని చెప్పింది. తద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లను తప్పుదోవ పట్టించి, నష్టం కలిగించినట్లు వివరించింది.

ED వివరాల ప్రకారం.. ఈ నిధులను ఆయా కంపెనీల మూలధన అవసరాలు తీర్చడానికి, ఆస్తులు కొనుగోలు చేయడానికి మరియు బ్యాంకులు అనుమతించని ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించబడ్డాయి. నకిలీ పత్రాలను సిద్ధం చేసి, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ (LC) కోసం బ్యాంకుల ముందు మోసపూరితమైన రిప్రజెంటేషన్‌లు చేశారు. ఆ నిధులను తిరిగి వారి స్వంత కంపెనీలకు మళ్లించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+