IPO News: గ్రేమార్కెట్లో దంచికొడుతున్న ఐపీవో.. ఇన్వెస్టర్లు ఎగబడి బెట్టింగ్.. మీరూ కొంటున్నారా?

ECOS Mobility IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల రద్దీ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానంగా ఎస్ఎమ్ఈ కేటగిరీ ఎంట్రీలపై జాగ్రత్తగా ఉండాలని ఈవారం మార్కెట్ లెగ్యులేటరీ సంస్థ సెబీ పెట్టుబడిదారులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇన్వెస్టర్లలో జోరు ఏమాత్రం తగ్గటం లేదు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈసీఓఎస్ మెుబిలిటీ అండ్ హాస్పిటాలిటీ కంపెనీ ఐపీవో గురించే. ప్రస్తుతం కంపెనీ ఐపీవో సబ్‌స్క్రిష్టన్ గడువు ముగిసింది. ఈ క్రమంలో ఐపీవో పెట్టుబడిదారుల నుంచి గడచిన మూడు రోజులు విశేష స్పందనను పొందింది. బిడ్డింగ్ చివరి రోజున భారీగా 64.18 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. వాస్తవానికి కంపెనీ 1,80,00,000 షేర్లను ఐపీవోలో విక్రయానికి ఉంచగా.. దరఖాస్తుదారులు 80,86,90,256 షేర్ల కోసం బిడ్డింగ్ వేసినట్లు ఎన్ఎస్ఈ డేటా ప్రకారం వెల్లడైంది. పైగా ఐపీవోలో పూర్తిగా షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించబడుతున్నాయి.

ECOS Mobility IPO shares rocking in grey markets with high premium Know details

ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి వచ్చిన భారీ స్పందనతో అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్ల భాగం 136.85 రెట్లు, సంస్థాగతేతర పెట్టుబడిదారుల కోసం 71.17 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 19.66 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ఐపీవో తెరుచుకున్న తొలిరోజునే పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేయబడింది. పెట్టుబడిదారుల కోసం ఆగస్టు 28 నుంచి 30 వరకు అందుబాటులో ఉన్న ఐపీవో తన ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.318-334గా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ ఐపీవో ఒక్కో షేరు రూ.152 ప్రీమియం పలుకుతున్నాయి. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగినట్లయితే స్టాక్ రూ.486 రేటు వద్ద మార్కెట్లో లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో జాబితా కానుంది.

కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే దేశంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా కార్పొరేట్ క్లయింట్‌లకు ఉద్యోగుల రవాణా సేవలు, డ్రైవర్ కార్ రెంటల్ వ్యాపారంలో ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం దిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు నగరాల్లో కంపెనీ వాహనాలను అందిస్తోంది. లగ్జరీ కోచ్‌లు, మినీవ్యాన్‌లు, ఎకానమీ ఆటోమొబైల్స్‌తో సహా 12,000 వాహనాలను నిర్వహిస్తోంది.

ఇండిగో, హెచ్‌సీఎల్ కార్పొరేషన్, సేఫ్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, డెలాయిట్, అర్బన్‌క్లాప్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్, ఫార్‌సైట్ గ్రూప్ వంటి కార్పొరేట్ సంస్థలతో వ్యాపారం నిర్వహిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.554.41 కోట్లుగా ఉండగా పన్ను తర్వాత నికర లాభం రూ.62.53 కోట్లుగా నమోదైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+