కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం భారత ఆర్థిక వ్యవస్థపై బుధవారం మరోసారి స్పందించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆమె ఆర్థిక బృందాన్ని అసమర్థ వైద్యులుగా పేర్కొన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ చర్చలో భాగంగా మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై కేంద్రంపై నిప్పులు చెరిగారు.

ఐసీయూలో కాదు.. కానీ
భారతీయ సీనియర్ ఆర్థికవేత్త అర్వింద్ సిబ్రమణియన్ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై చిద్దూ స్పందిస్తూ.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వీల్చైర్లో కూర్చొని ఐసీయులోకి తీసుకు వెళ్తున్న పేషెంట్ మాదిరిగా ఉందన్నారు. కానీ దీనిని గేటు వద్ద అసమర్థ వైద్యుల బృందం చూసేందుకు అడ్డుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

అంతా చిందరవందర.. ఐనా బాగుందని ప్రభుత్వం
గత కొన్నాళ్లుగా డిమాండ్ పెరగడం లేదని చిదంబరం గుర్తు చేశారు. నిరుద్యోగ శాతం రోజు రోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రెడిట్ అంతా చిందరవందరగా తయారయిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అంతా బాగానే ఉందని ఇప్పటికీ చెప్పడం విడ్డూరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుండి 8 శాతానికి ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు.

సమర్థవంత బృందం అవసరం
ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బ్యాడ్గానే ఉందని, కానీ 1991 వంటి పరిస్థితులు లేవని చిద్దూ చెప్పారు. 1997లో ఆసియా ఫైనాన్షియల్ క్రైసిస్, 2013 వంటి పరిస్థితులకు దగ్గరగా ఉందని అభిప్రాయపడ్డారు. నాటిలా పరిస్థితిని చక్కదిద్దేందుకు సమర్థవంతమైన బృందం అవసరమని సూచించారు.

కేంద్రంపై చిద్దూ విమర్శలు
కాగా, ఇటీవల చిదంబరం మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందన్నారు. అన్ని రంగాల్లో వృద్ధి కనిపించడం లేదన్నారు. జీడీపీ రేటు దారుణంగా పడిపోయిందన్నారు. దీనికి నోట్ల రద్దు కూడా కారణమని చెప్పారు. ఐసీయూలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు కేంద్రం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications