భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (జనవరి 29) పార్లమెంటులో ఎకనామిక్ సర్వే(Economic survey)ను విడుదల చేశారు. దీని ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో (FY27) భారతదేశపు ఎకానమీ 6.8 శాతం నుండి 7.2 శాతం మధ్య వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరంగా దూసుకుపోతుండటం విశేషం. మన దేశ సంభావ్య వృద్ధి రేటు (Potential Growth) సుమారు 7 శాతంగా ఉంటుందని సర్వే పేర్కొంది.

దేశీయ డిమాండ్.. వృద్ధికి వెన్నెముక
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, భారతదేశం యొక్క అంతర్గత బలాలు ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం (Rural Consumption) పెరగడం, వ్యవసాయ రంగం మెరుగైన ప్రదర్శన కనబరచడం వృద్ధికి ప్రధాన కారణాలుగా మారాయి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ప్రభుత్వం చేపట్టిన పన్ను హేతుబద్ధీకరణ (Tax Rationalisation) చర్యల వల్ల సామాన్యుడి చేతిలో ఖర్చు పెట్టడానికి ఎక్కువ డబ్బులు మిగులుతున్నాయని, ఇది దేశీయ మార్కెట్లో వస్తువుల డిమాండ్ పెరగడానికి దోహదపడిందని సర్వే (Economic survey) విశ్లేషించింది.
తక్కువ ద్రవ్యోల్బణం - స్థిరమైన ఉపాధి
భారత ఎకానమీ (indian economy) ప్రస్తుతం అత్యంత సానుకూల పరిస్థితుల్లో ఉందని సర్వే వెల్లడించింది. తక్కువ ద్రవ్యోల్బణం, స్థిరమైన ఉపాధి అవకాశాలు , పెరుగుతున్న కొనుగోలు శక్తి వల్ల వినియోగం అన్ని రంగాల్లో విస్తృతంగా సాగుతోంది. గ్లోబల్ షాక్లు లేదా అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోగలిగేంత పటిష్టమైన బఫర్స్ (Bufffers) భారత్ వద్ద ఉన్నాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల విదేశీ పెట్టుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది.
సవాళ్లు , భవిష్యత్తు అంచనాలు
వృద్ధి రేటు బాగున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ట్రేడ్ ఫ్రాగ్మెంటేషన్, ఆర్థిక రంగంలో నెలకొన్న సున్నితమైన పరిస్థితులపై సర్వే హెచ్చరించింది. గ్లోబల్ మార్కెట్లలో వచ్చే మార్పులు మనపై కొంత ఆలస్యంగా ప్రభావం చూపే అవకాశం ఉందని, కాబట్టి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్యకాలికంగా చూస్తే.. భారతదేశం యొక్క వృద్ధి పథం చాలా బలంగా ఉందని, ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు , స్థిరమైన స్థూల ఆర్థిక విధానాలు మన దేశాన్ని ప్రపంచ ఆర్థిక పటంలో అగ్రస్థానంలో నిలుపుతాయని ఎకనామిక్ సర్వే (Economic survey) ఆశాభావం వ్యక్తం చేసింది.
బడ్జెట్ 2026 కు అసలైన 'రిపోర్ట్ కార్డ్'
కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (జనవరి 29) పార్లమెంటులో ఈ ఎకనామిక్ సర్వేను సమర్పించారు. ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన ఈ కీలక పత్రం, ప్రభుత్వ ఆర్థిక పనితీరుకు ఒక 'రిపోర్ట్ కార్డ్' వంటిది. దీని ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ 6.8% నుండి 7.2% వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేయడమే కాకుండా దేశ సంభావ్య వృద్ధి రేటును 7%గా పేర్కొన్నారు. గత ఏడాది సర్వేలో FY26 కోసం రియల్ జీడీపీ వృద్ధిని 6.3-6.8%గా అంచనా వేయగా.. ఇప్పుడు అది మరింత మెరుగుపడటం విశేషం. అదేవిధంగా ఈ ఏడాది ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4%కి అనుగుణంగానే ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇది సామాన్యుడికి పెద్ద ఊరటనిచ్చే అంశం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications