లాక్ డౌన్ ఇలాగే ఎక్కువ కాలం కొనసాగిస్తూ వెళ్తే ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఓసారి ప్రకటన తర్వాత రెండుసార్లు పొడిగించారు. మూడోసారి పొడిగిస్తారేమోననే అనుమానాలు ఉన్నాయి. దీనిపై పారిశ్రామిక దిగ్గజం స్పందించారు. మార్చి 24న తొలిసారి లాక్ డౌన్ పైన ప్రకటన చేశారు ప్రధాని మోడీ. తొలుత ఏప్రిల్ 14 వరకు ఉండగా ఆ తర్వాత మే 3 వరకు పొడిగించారు. అనంతరం మే 17వ తేదీ వరకు పొడిగించారు.

ఆత్మహత్యా సదృశ్యమయ్యే అవకాశం
లాక్ డౌన్ను మరింతకాలం పొడిగిస్తే దేశానికి ఆర్థికంగా ఆత్మహత్యా సదృశ్యమేనని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఎక్కువ కాలం పొడిగిస్తే రిస్క్ ఎక్కువ అన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రజల ప్రాణాలు కాపాడుకోగలమని, కానీ ఇలాగే పొడిగిస్తూ వెళ్తే బడుగు వర్గాలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. టెస్టుల సంఖ్య పెరుగుతుంటే కేసుల సంఖ్య పెరగడం సాధారణమని, కానీ దీర్ఘకాలం పొడిగిస్తే ఆర్థికంగా ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్క్ ఉందని, కరోనాతో కలిసి సహజీవనం చేయక తప్పదన్నారు. అదేం వీసాపై వచ్చిన పర్యాటకురాలు కాదన్నారు.

ప్రజల జీవితాలకు ఇది రోగ నిరోధక వ్యవస్థ లాంటిది
పనిచేస్తూ వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.. ప్రజల జీవితాలకు రోగ నిరోధక వ్యవస్థ లాంటిది అవుతుందని ఆనంద్ మహీంద్రా అన్నారు. లాక్ డౌన్ను మరింత పొడిగించడమంటే ఆ వ్యవస్థను బలహీనపరచడమే అవుతుందన్నారు. అలా చేయడం మన సమాజంలోని అట్టడుగువర్గాల్ని ఎక్కువగా దెబ్బతీస్తుందని చెప్పారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఇండియా డెత్ రేటు 1.4 శాతం మాత్రమే ఉందన్నారు. అదే ప్రపంచ సగటు 35 శాతం, అమెరికాలో 228గా ఉందని గుర్తు చేశారు

నిపుణులదీ అదే మాట
కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి కేంద్రం లాక్ డౌన్ను మరికొంతకాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆర్థిక నిపుణులు కూడా ఇదే సూచన చేస్తున్నారు. లాక్ డౌన్ ఎక్కువ కాలం కొనసాగించవద్దని, ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పూర్తిగా పడిపోయింది. వ్యాపారాలు స్తంభించిపోయాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications