న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ పైన 1 శాతం మేర టీడీఎస్ను కొత్త పన్నుగా విధించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. దీంతో ఈ-కామర్స్ సైట్లపై వస్తువులను విక్రయించే వారిపై భారం పడనుంది. ఇందుకు కొత్త సెక్షన్లు 194ఓను ప్రవేశ పెట్టనుంది.
ఈ-కామర్స్ లావాదేవీలపై కొత్తగా ఒక శాతం టీడీఎస్ (మూల ధనం వద్ద పన్ను మినహాయింపు)ను విధిస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్ఫాంను నిర్వహించే ఈ-కామర్స్ ఆపరేటర్... విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1% టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది.

ఈ సవరణ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి వస్తుంది. ఈ -కామర్స్ ఆపరేటర్ లేదా డిజిటల్ ప్లాట్ ఫాంను నిర్వహించే వాళ్లు లేదా ఓనర్లు మొత్తం స్థూల విక్రయాలు లేదా సేవలు లేదా రెండింటి పైన ఒక శాతం టీడీఎస్ను విధించవలసి ఉంటుంది.
అయితే, ఎవరైనా విక్రేత ఈ-కామర్స్ సైట్ ద్వారా జరిపిన స్థూల విక్రయాల మొత్తం రూ.5 లక్షలలోపు ఉండి ఆధార్ లేదా పాన్ను ఇచ్చి ఉంటే ఈ నిబంధన వర్తించదు. దీనిని అధ్యయనం చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications