Social Media Viral: చాలామంది పెళ్లి కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టడం తెలిసిందే. అనంతరం పిల్లల్ని కనడం, వారిని పెంచి పోషించడం సర్వ సాధారణం. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాహం తర్వాత జీవితం ఎలా ఉండాలి అనే విషయంపై ఈమధ్య పెళ్లికి ముందే అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. కానీ అందుకు మించిన ట్విస్ట్ ఈ స్టోరీలో చూడవచ్చు.
పెళ్లి తర్వాత భర్తతో పిల్లల్ని కనేందుకు, వారిని పెంచేందుకు ఓ దుబాయ్ ఇల్లాలు సవాలక్ష కండిషన్లు పెట్టింది. ప్రతినెలా 2.5 కోట్లు రూపాయలు భృతిగా చెల్లించాలని డిమాండ్ చేసింది. ఉచితంగా పురిటినొప్పిని ఏమాత్రం భరించనని తెగేసి చెప్పింది. డెలివరీ సమయంలో తన అందచందాలను కాపాడేందుకు మేకప్ మరియు హెయిర్ డ్రెస్సెంగ్ టీమ్ ఉండాలని కోరింది. డెలివరీ అనంతరం దాదాపు 2 వేల మంది తనను చూసేందుకు వస్తారని, అందుకోసం తనకు VIP గదిని బుక్ చేయాలని పట్టుబట్టింది.

వీటికి అదనంగా పిల్లల మెయింటెనెన్స్ కు ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇద్దరు పిల్లలు అయితే ఈ అమౌంట్ డబుల్ అవుతుందని పేర్కొంది. అంతేకాకుండా తన రోజువారీ జీవితానికి ఎటువంటి భంగం కలగకుండా పిల్లల ఆలనాపాలనా చూసేందుకు పని మనుషులను పెంచాలని కోరింది. రాత్రిళ్లు నిద్రాభంగం కాకుండా నర్సును సైతం రిక్రూట్ చేయాలని కండీషన్ పెట్టింది.
ఇవే కాకుండా బుర్జ్ అల్ అరబ్ మీద భారీ ఎత్తున జెండర్ రివిల్ చేయాలని తన కోరుతున్నట్లు చెప్పుకొచ్చింది. తన భర్త పెద్దఎత్తున ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలని, కొత్త కారు గిఫ్ట్ గా ఇవ్వాలని ఆశిస్తోంది. ప్రసవం నాటికి తాను వీటిని పూర్తిగా నెరవేరుస్తాడని తెలిపింది. ఈ విషయాలన్నీ పెళ్లికి ముందే తన భర్తతో చర్చించానని చెప్పి షాక్ ఇచ్చింది. దీన్నంతా చదివిన నెటిజన్లు ఇది వివాహము కాదని కేవలం బిజినెస్ డీల్ అని కామెంట్స్ చేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications