బెంగళూరు వాహనదారులకు షాక్.. NICE రోడ్, ఈ-సిటీ ఫ్లైఓవర్ కొత్త టోల్ ఛార్జీలు అమల్లోకి..
బెంగళూరు నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారి మార్గాలైన నైస్ రోడ్, ఎలక్ట్రానిక్స్ సిటీ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వే ,జాతీయ రహదారి 44 (NH-44) లోని కొన్ని భాగాలపై సవరించిన టోల్ ఛార్జీలు జూలై 1 నుండి అమల్లోకి రావడంతో నిత్యం ప్రయాణించే పౌరులపై ఆర్థిక భారం పెరిగింది. డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. నంది ఎకనామిక్ కారిడార్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (NICE) ,బెంగళూరు ఎలివేటెడ్ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ (BETPL) సంస్థలు విడివిడిగా ఈ ధరల పెంపును ప్రకటించాయి. తమ రాయితీ ఒప్పందాల నిబంధనలు ,మార్చి 31, 2026 నాటి తాజా టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా ఈ సవరణలు చేసినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ కొత్త ధరలు జూన్ 30, 2027 వరకు అమల్లో ఉంటాయి.
నైస్ రోడ్డు పరిధిలోకి వచ్చే బెంగళూరు-మైసూరు మౌలిక సదుపాయాల కారిడార్ (BMIC) ప్రాజెక్టులోని 40.8 కిలోమీటర్ల పెరిఫెరల్ రోడ్డు,8.1 కిలోమీటర్ల లింక్ రోడ్డులపై ప్రయాణించే ద్విచక్ర వాహనాలు, కార్లు వాటి ప్రయాణ దూరాన్ని బట్టి కనీసం 10 శాతం అదనపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెరిగిన ధరలను సమీప రూపాయికి రౌండ్ అప్ చేస్తారు. బనశంకరి, తావరకెరె ,ఎలక్ట్రానిక్స్ సిటీ వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ నైస్ రోడ్ ద్వారా బస్సులు నడిపే బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC) పై కూడా ఈ ప్రభావం పడనుంది. రవాణా సంస్థ ఈ అదనపు నిర్వహణ ఖర్చులను టికెట్ ధరల రూపంలో ప్రయాణికులపైనే మోపే అవకాశం ఉంది.

మరోవైపు సిల్క్ బోర్డ్ జంక్షన్ను ఎలక్ట్రానిక్స్ సిటీతో అనుసంధానించే ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వే ,కర్ణాటక-తమిళనాడు సరిహద్దు వరకు ఉన్న NH-44 మార్గంలో కూడా టోల్ రేట్లు మారాయి. ముంబైకి చెందిన 'గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్' రాయితీ ఒప్పందం కింద ఈ నిర్వహణ జరుగుతోంది. కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్ వద్ద కార్లు, జీపులు ,వ్యాన్లకు ఒకే రోజులో అనేక ప్రయాణాలు చేసే 'మల్టిపుల్-జర్నీ' టోల్ రుసుము రూ. 95 నుండి రూ. 100కి పెరిగింది.
వీటి నెలవారీ పాస్ ధర కూడా రూ. 1,885 నుండి రూ. 1,960కి సవరించబడింది, అయితే ఒకే ప్రయాణానికి (సింగిల్-జర్నీ) చెల్లించే టోల్ ఛార్జీలలో ఎలాంటి మార్పు చేయలేదు. ద్విచక్ర వాహనదారుల విషయానికి వస్తే, వారి నెలవారీ పాస్ ధర రూ. 755 నుండి రూ. 785కి పెరగ్గా, సింగిల్ ,మల్టిపుల్-జర్నీ ఛార్జీలను పాత పద్ధతిలోనే ఉంచారు. వీటితో పాటు NH-44పై ఉన్న అట్టిబెలే టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు మల్టిపుల్-జర్నీ టోల్ రుసుమును రూ. 55 నుండి రూ. 60కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
