న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి మరో అత్యున్నత స్థాయి అధికారిని పొట్టనబెట్టుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మొహపాత్ర కన్నుమూశారు. కోవిడ్ సంబంధిత అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతోన్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. నెలన్నర రోజులుగా ఆయన దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు.
1986 బ్యాచ్ గుజరాత్ కేడర్కు చెందిన ఐఎఎస్ అధికారి డాక్టర్ గురుప్రసాద్ మొహపాత్ర. ఆయన స్వరాష్ట్రం ఒడిశా. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పని చేసిన సమయంలో పలు కీలక హోదాల్లో పనిచేశారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తుడు, ఇష్టుడైన అధికారిగా గుర్తింపు పొందారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లారు. వాణిజ్య శాఖ జాయింట్ కార్యదర్శిగా వ్యవహరించారు. స్పెషల్ ఎకనమిక్ జోన్స్ ప్రమోషన్ బోర్డులో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్గా పనిచేశారు. అనంతరం డీపీఐఐటీ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

గురుప్రసాద్ మొహపాత్ర మృతి పట్ల ప్రధాని మోడీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ సంతాపం తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా డాక్టర్ గురుప్రసాద్తో తాను కలిసి పని చేశానని ప్రధాని పేర్కొన్నారు. ఆయన ఇక లేరనే వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా.. కొత్త తరహా ఆలోచనలతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నారని చెప్పారు. గురుప్రసాద్ మరణంతో ఒడిశా ఓ నిజమైన యోధుడిని కోల్పోయిందని ధర్మేంద్ర ప్రధాన్ సంతాపం తెలిపారు. గురుప్రసాద్ మరణం కలచివేసిందంటూ పియూష్ గోయెల్ ట్వీట్ చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications