5G Internet: ప్రైవేటు కంపెనీలకు ఎదురుదెబ్బ.. DoT సంచలన నిర్ణయం..
5G Internet: గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఇంటర్నెట్ వినియోగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచం మెుత్తం డిజిటలీకరణ అవుతున్న తరుణంలో సామాన్యుల నుంచి కంపెనీల వరకు అందరూ వేగవంతమైన నెట్ వినియోగిస్తున్నారు.
ఈ క్రమంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం సమయంలో ప్రైవేటు కంపెనీలు తమ అవసరాల కోసం పాల్గొన్నాయి. అయితే ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT) నేరుగా ప్రైవేట్ నెట్వర్క్లకు 5G స్పెక్ట్రమ్ను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుందని వెల్లడైంది. ఈ నిర్ణయం కారణంగా ఇన్ఫోసిస్, లార్సెన్ & టూబ్రో, టాటా పవర్, GMR, అదానీ గ్రూప్ వంటి సంస్థలపై ప్రభావం చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

వేలానికి అనుకూలంగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, టెల్కో సలహాలకు అనుగుణంగా, ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ప్రకారం ప్రైవేట్ నెట్వర్క్ల కోసం నేరుగా ఎంటర్ప్రైజెస్కు స్పెక్ట్రమ్ను కేటాయించడం సాధ్యం కాదని DoT గమనించింది. అయితే త్వరలో తన నిర్ణయాన్ని క్యాబినెట్ తో పాటు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి తెలియజేస్తుందని DoT అధికారులు తెలిపారు.
అయితే ప్రైవేటు కంపెనీలు తమ నెట్వర్క్లను సెటప్ చేయాలనుకుంటే అందుకోసం దేశంలోని టెలికాం ఆపరేటర్ల నుంచి 5G స్పెక్ట్రమ్ను లీజుకు తీసుకోవచ్చు. లేదా టెలికాం ఆపరేటర్లను తమ ప్రైవేట్ నెట్వర్క్లను విడుదల చేయమని అడగవచ్చని తెలుస్తోంది. టెక్నాలజీ సంస్థలు, టెలికాం ఆపరేటర్ల మధ్య విభేదాలతో 5G స్పెక్ట్రమ్ను ఎంటర్ప్రైజెస్కు నేరుగా కేటాయించే అంశం వివాదాస్పదంగా ఉంది.


Click it and Unblock the Notifications