అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బి వీసా రుసుములను భారీగా పెంచే నిర్ణయం యుఎస్ లోని భారతీయ ఐటీ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం 1,000 డాలర్లుగా ఉన్న వీసా రుసుము వచ్చే ఏడాది నుండి 100,000 డాలర్లకి పెరగనుంది. ఇది 283 బిలియన్ డాలర్ల అవుట్సోర్సింగ్ రంగానికి తీవ్రమైన దెబ్బగా మారనుంది.2024లో జారీ అయిన హెచ్-1బి వీసాలలో 70 శాతం భారతీయ ఐటీ సంస్థలదేనని చెప్పవచ్చు.
వీసా ఫీజు పెంపుతో పాటు, అమెరికా చట్టసభ సభ్యులు కూడా భారతీయ ఐటీ కంపెనీలపై దృష్టి సారించారు. రిపబ్లికన్ సెనేటర్ చార్లెస్ గ్రాస్లీ, డెమోక్రాట్ రిచర్డ్ డర్బిన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), కాగ్నిజెంట్ కంపెనీల నియామక విధానాలపై లేఖలు రాశారు. వీటిలో అమెరికన్ ఉద్యోగులను తొలగించి, దక్షిణాసియా H-1B కార్మికులను నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

TCS గత సంవత్సరం 12 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు, వారిలో అమెరికన్లు కూడా ఉన్నారని సెనేటర్లు ఆరోపించారు. FY25లో TCS 5,505 హెచ్-1బి ఉద్యోగులను స్పాన్సర్ చేసింది. కాగ్నిజెంట్పై కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం ఒక అమెరికన్ జ్యూరీ, కాగ్నిజెంట్ అమెరికన్ ఉద్యోగులపై జాతి ఆధారిత వివక్ష చూపిందని తేల్చింది. కాగ్నిజెంట్ FY25లో 2,493 హెచ్-1బి ఉద్యోగులను నియమించింది.
రెండు కంపెనీల CEOలైన TCS కృతివాసన్, కాగ్నిజెంట్కి రవి కుమార్కు అమెరికా సెనేటర్లు తొమ్మిది ప్రశ్నలు వేశారు. అమెరికన్లను తొలగించి హెచ్-1బి కార్మికులను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నతో పాటు, జీతాలు, ప్రయోజనాలు సమానమా అనే విషయాలపై వివరణ కోరారు. అక్టోబర్ 10లోపు సమాధానాలు ఇవ్వాలని గడువు విధించారు. అంతేకాకుండా, మరికొంతమంది రిపబ్లికన్ సెనేటర్లు కూడా హెచ్-1బి ప్రోగ్రామ్ను కఠినతరం చేసే బిల్లులను తెస్తున్నారు.
టామ్ కాటన్ ఈ ప్రోగ్రామ్లో మార్పుల కోసం రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించగా, బెర్నీ మోరెనో HIRE చట్టాన్ని ప్రతిపాదించారు. ఇది ఆఫ్షోరింగ్ కంపెనీలపై పన్నులు పెంచి, అమెరికన్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా తీసుకువస్తున్నారు. హెచ్-1బి నియంత్రణలతో పాటు, కృత్రిమ మేధస్సు (AI) పెరుగుదల కూడా భారతీయ ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు ద్వంద్వ సవాలుగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిని ఆటోమేట్ చేయగలిగే AI వృద్ధి, మానవ ఆధారిత అవుట్సోర్సింగ్ మోడల్ను బలహీనపరుస్తోంది.
ఈ పరిణామాల కారణంగా.. పెట్టుబడిదారుల విశ్వాసం కూడా కుదేలైంది. భారతదేశంలోని 10 అతిపెద్ద ఐటీ సేవా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం దాదాపు 8 శాతం తగ్గింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా నియంత్రణలు, AI ప్రభావం కలిపి భారత ఐటీ రంగానికి కొత్త వ్యూహాలు అవసరమని సూచిస్తోంది. అమెరికాలో కొనసాగడానికి భారతీయ ఐటీ సంస్థలు కేవలం తక్కువ ఖర్చుతో వర్క్ఫోర్స్ని పంపడమే కాకుండా, స్థానిక మద్దతు పొందడం, సంస్కృతిని అర్థం చేసుకోవడం, మరియు భవిష్యత్తు టెక్నాలజీల్లో ముందడుగు వేయడం తప్పనిసరి అయింది ఇప్పుడు.
More From GoodReturns

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications