న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణం ఇక మరింత భారం కానుంది. డొమెస్టిక్ విమాన ప్రయాణాల ఛార్జీలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సవరించింది. ఛార్జీల్లో 13 నుంచి 16 శాతం మేర పెంచింది. పెరిగిన విమాన ఛార్జీలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పెంపుదల భారాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ ప్రయాణికులపైనే మోపింది. లోయర్ క్లాస్కు మాత్రమే వర్తింపజేసింది. ధనిక, ఉన్నత వర్గాలు రాకపోకలు సాగించే అప్పర్ క్లాస్ ఛార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. పెంపుదల నుంచి ఆ క్లాస్ను మినహాయించింది. వాటి ఛార్జీల్లో ఎలాంటి సవరణలు చేయలేదు. అవి యధాతథంగా కొనసాగుతాయి.

కరోనా ఎఫెక్టే..
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్ల దేశీయ విమానయాన సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న కారణంగా ఛార్జీలను పెంచినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాజాగా చేసిన సవరణల ప్రకారం.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఇదివరకు 2,300 రూపాయల ఛార్జీని చెల్లించాల్సి ఉండగా.. జూన్ 1వ తేదీ నుంచి 2,600 రూపాయలను కట్టాల్సి ఉంటుంది. 40 నుంచి 60 నిమిషాల విమాన ప్రయాణానికి ఇకపై ప్రయాణికులు చెల్లించాల్సిన ఛార్జీ ధర 3,300 రూపాయలు. ప్రస్తుతం ఇది 2,900 రూపాయలుగా ఉంటోంది.

పెంపు ఇలా..
విమాన ప్రయాణ సమయం 60-90, 90-120,120-150, 150-180, 180-210 నిమిషాలను ప్రాతిపదికగా తీసుకుని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఛార్జీల మోత మోగించింది. దీని ప్రకారం.. ఒక్కో లోయర్ క్లాస్ ప్రయాణికుడిపై 4,000, 4,700, 6,100, 7,4,00, 8,700 రూపాయల మేర భారం పడుతుంది. ప్రస్తుతం ఆయా ప్రయాణ సమయానికి విమానయాన సంస్థలు వసూలు చేస్తోన్న ఛార్జీలు 3,500, 4,100, 5,300, 6,400, 7,600 రూపాయల మేర ఉంటోంది.

80 శాతం ఆక్యుపెన్సీకి వీలు..
దీనితోపాటు 80 శాతం ఆక్యుపెన్సీకి కూడా అనుమతి ఇచ్చినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం డొమెస్టిక్ విమాన సర్వీసుల్లో సీట్ల భర్తీ 50 శాతం మాత్రమే. జూన్ 1 నుంచి 80 శాతం మేర సీట్లను భర్తీ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఆక్యుపెన్సీ శాతాన్ని పెంచుకోవడానికి వీలు కల్పించడం, లోయర్ క్లాస్ రేట్లు పెంచడం వంటి చర్యల వల్ల విమానయాన సంస్థలు ఆర్థిక సుడిగుండాల నుంచి బయటపడతాయని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరో నెల నిషేధం..
కాగా- అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో నెల వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం వచ్చేనెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కార్గో విమాన సర్వీసుల సేవలు మాత్రం దేశీయంగా, అంతర్జాతీయంగా యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా- ఈ నెల చివరి నాటికి కూడా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతలో ఆశించిన స్థాయిలో తగ్గుదల కనపర్చకపోవడం వల్లే అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని పొడిగించాల్సి వచ్చిందని కేంద్రం పేర్కొంది.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications