ఈ భారత ఐటీ షేర్లు H-1B ఫీ పెంపుతో నెగటివ్లో ఎందుకు పడ్డాయో తెలుసా?
ఈసారి అమెరికా ట్రంప్ పరిపాలన H-1B వీసా ఫీలో భారీ పెంపు ప్రకటించడంతో, భారత ఐటీ దిగ్గజాల షేర్లకు షాక్ ఇచ్చింది. ఈ ఉదయం NSE Nifty50, BSE సెన్సెక్స్ లొ నెగటివ్ ట్రెండ్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, TCS, HCLTech వంటి కంపెనీల షేర్లు తీవ్రంగా పడిపోయాయి. ఈ ప్రభావానికి కారణం అమెరికాలో పని చేసే భారతీయ టెక్ నిపుణుల చాలా మంది వీసా ఆధారంగా ఉన్నారు కాబట్టి H-1B ఫీ పెంపు వాళ్లకైనా, కంపెనీలకైనా నేరుగా ఇబ్బంది సృష్టిస్తోంది.

ఈ కొత్త పాలసీ ప్రకారం, H-1B వీసా ఫీ ఇంతకి ముందు $2,000-$5,000 స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు $100,000 (భారత రూపాయల్లో దాదాపు రూ. 88 లక్షలు)కు పెంచారు. మొదట ఈ వార్త వెలువడిన తర్వాత, అమెరికా వదిలి వెళ్ళాలి ఏమో అని ప్రజలు కూడా భయంతో అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత, ట్రంప్ పరిపాలన తెలిపింది, ఈ కొత్త ఫీ కొత్త అభ్యర్థులకే వర్తిస్తుందని దానికి ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంచెం కుదుట పడ్డారు.
ఆర్థికంగా ఈ H-1B వీసా ఫీ పెంపు ఎందుకు కష్టమో అమెరికా వాణిజ్య సచివాలయం హోవర్డ్ లుట్నిక్ ఇలా వివరిస్తున్నారు. పెద్ద కంపెనీలు విదేశీ నిపుణులను తీసుకోవడం ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది. మొదట ప్రభుత్వానికి $100,000 చెల్లించాలి, తర్వాత ఉద్యోగికి జీతం ఇవ్వాలి. ఇది ఆర్థికంగా సాధ్యం కాదు. అందుకే, పెద్ద కంపెనీలు అమెరికన్ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని ప్రాధాన్యం ఇస్తున్నాయి, ఇతర దేశల వాళ్లను తీసుకోవడం తగ్గిస్తున్నాయి. ఇప్పటి వరకు, USCIS డేటా ప్రకారం, H-1B వీసా ఆమోదం పొందిన అభ్యర్ధులలో 71% మంది భారతీయులు. అంటే భారతీయ టెక్ ప్రొఫెషనల్స్ పై దీని ప్రభావం సాలిడ్గా ఉంది.
ఇన్ఫోసిస్, TCS, HCLTech లాంటి ఐటీ దిగ్గజ కంపెనీల షేర్లు ఒకటే కాకకుండా ఆర్థిక నిపుణుల చెబుతున్నట్టు, అమెరికా H-1B వీసా పాలసీ మార్పులే కాకుండా, రాబోయే త్రైమాసిక ఫైనాన్షియల్ అంచనాలు కూడా ఈ షేర్లపై ప్రభావం చూపిస్తున్నాయి. షేర్లలో ఈ గిరాకీ కొంత పానిక్ సెల్లింగ్ని కూడా రేకెత్తించింది.
భారత ప్రభుత్వం ఈ చర్య "కుటుంబాల జీవితానికి ఇబ్బంది కలిగించవచ్చు" అని చెప్పారు. MEA ప్రకారం,"భారత-అమెరికా ఇండస్ట్రీల ఇన్నోవేషన్, సృజనాత్మకతలో భాగస్వామ్యం ఉంది. ఈ నైపుణ్య మార్పులు, టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, పోటీ సామర్థ్యం, సంపద సృష్టికి ముఖ్యమైనవి. అందువల్ల, ఈ చర్యలను పరస్పర లాభాలను దృష్టిలో ఉంచి మిగతా మార్గాలను పరిశీలించాలి."
ఈ H-1B వీసా ఫీ పెంపు ఒక "షాక్ వెబ్" కాబట్టి, భారత ఐటీ దిగ్గజాల షేర్లపై నేరుగా ప్రభావం చూపింది. ఉద్యోగులు, కంపెనీలు, మరియు మార్కెట్ పూర్వదర్శితంగా దీన్ని మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


Click it and Unblock the Notifications