భారతీయ విమాన ప్రయాణికులకు సంతోషకరమైన వార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఇకపై మీరు విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటలలోపు దానిని రద్దు చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. అదీ ఎటువంటి అదనపు రుసుము లేకుండా మీరు ఆ పనులు చేయవచ్చు. ఇప్పటి వరకు, విమానయాన సంస్థలు రద్దులకు గానూ, మార్పులకు గానూ భారీ ఫీజులు వసూలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశాయి. DGCA తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఆ సమస్యను పూర్తిగా తగ్గించబోతోంది.
DGCA ప్రతిపాదన ప్రకారం.. ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన 48 గంటల లోపు రద్దు చేసుకోవడం లేదా తేదీ మార్చుకోవడం సాధ్యమవుతుంది. ఈ సమయంలో రద్దు ఫీజులు పూర్తిగా మాఫీ చేయబడతాయి. అయితే కొత్త టికెట్ ధర ఎక్కువగా ఉంటే, ప్రయాణికుడు కేవలం ధర తేడాను మాత్రమే చెల్లించాలి. ఈ నియమం దేశీయ విమాన టిక్కెట్లకు 5 రోజుల ముందుగానే బుక్ చేసిన ప్రయాణాలకు, అంతర్జాతీయ టిక్కెట్లకు 15 రోజుల ముందుగానే బుక్ చేసిన ప్రయాణాలకు వర్తిస్తుంది. అంటే, బుకింగ్ చేసిన వెంటనే మార్పు అవసరం వచ్చినా, ఇకపై ఎయిర్లైన్లు ఎటువంటి అదనపు జరిమానాలు విధించలేవు.

టిక్కెట్లు ఏజెంట్ లేదా ట్రావెల్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినప్పటికీ.. రీఫండ్ బాధ్యత ఎయిర్లైన్దే నని DGCA స్పష్టంగా పేర్కొంది. ఏజెంట్లను ఎయిర్లైన్ల అధికార ప్రతినిధులుగా పరిగణిస్తామని DGCA తెలిపింది. అంటే టికెట్ రద్దు చేసిన తర్వాత రీఫండ్ ఆలస్యమైతే లేదా అందకపోతే, ప్రయాణికుడు ఎయిర్లైన్ను నేరుగా సంప్రదించవచ్చు. అదనంగా అన్ని విమానయాన సంస్థలు రీఫండ్ ప్రక్రియను 21 పని దినాలలోపు పూర్తి చేయాలి.ఇది ఆలస్యమైన రీఫండ్లపై ప్రయాణికుల ఫిర్యాదులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
DGCA తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికుడు ఆరోగ్య సమస్య లేదా అత్యవసర పరిస్థితి కారణంగా ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే, విమానయాన సంస్థ పూర్తి రీఫండ్ ఇవ్వవచ్చు లేదా క్రెడిట్ షెల్ జారీ చేయవచ్చు. తద్వారా ప్రయాణికుడు తరువాతి తేదీలో అదే మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా టికెట్ బుకింగ్ చేసిన 24 గంటల్లోపే ప్రయాణికుడు పేరులో చిన్న పొరపాటు సవరించాలనుకుంటే, విమానయాన సంస్థ ఉచితంగా మార్పు చేసే అవకాశం ఇవ్వాలి. అయితే, ఇది ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్ ద్వారా నేరుగా బుక్ చేసిన టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఇటీవల టికెట్ రద్దు ఫీజులు, ఆలస్యమైన రీఫండ్లు, ఏజెంట్ సమస్యలు వంటి అంశాలపై భారీగా ఫిర్యాదులు రావడంతో DGCA ఈ చర్య తీసుకుంది. ప్రయాణికుల హక్కులను రక్షిస్తూ, ఎయిర్లైన్లు పారదర్శకంగా వ్యవహరించాలని ఇది నిర్దేశిస్తోంది. DGCA ఈ ప్రతిపాదనపై నవంబర్ 30 వరకు ప్రజల సూచనలు కోరింది. ఆ తరువాత ఈ నియమం అధికారికంగా అమల్లోకి వస్తుందని అంచనా. ఈ మార్పులు అమలులోకి వస్తే, భారతదేశంలో విమాన ప్రయాణం ప్రయాణికులకు అనుకూలంగా మారనుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications