Adani Ports: అదానీకి ఎదురుదెబ్బ.. రాజీనామా చేసిన ఆడిట్ సంస్థ Deloitte.. కొత్తగా..
Adani News: అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ పోర్ట్స్ వ్యాపారానికి ఆడిటర్ గా వ్యవహరిస్తున్న ప్రఖ్యాత ఆడిట్ సంస్థ డెలాయిట్ రాజీనామా చేసింది. ఇది అదానీకి పెద్ద ఎదురుదెబ్బని చెప్పకోవచ్చు.
బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికలో ఫ్లాగ్ చేసిన కొన్ని లావాదేవీలపై డెలాయిట్ ఆందోళన వ్యక్తం చేసిన వారాల తర్వాత రాజీనామా చేయడం జరిగింది. డెలాయిట్ కంపెనీకి 2017 నుంచి ఆడిటర్ గా వ్యవహసిస్తోంది. ఈ క్రమంలో అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్(APSEZ) కొత్త ఆడిటర్గా MSKA & అసోసియేట్స్ నియమకాన్ని కంపెనీ ధృవీకరించింది.

ఇతర లిస్టెడ్ అదానీ పోర్ట్ఫోలియో కంపెనీల ఆడిటర్లుగా డెలాయిట్ విస్తృతమైన ఆడిట్ పాత్ర లేకపోవటాన్ని ఇటీవల APSEZ మేనేజ్మెంట్ తో జరిగిన సమావేశంలో సూచించింది. ఈ క్రమంలో ఇతర లిస్టెడ్ అదానీ పోర్ట్ఫోలియో కంపెనీలు ప్రత్యేక బోర్డులు, ఎగ్జిక్యూటివ్ టీమ్లు, మైనారిటీ షేర్హోల్డర్లతో పూర్తిగా స్వతంత్రంగా ఉన్నందున గ్రూప్-వైడ్ అపాయింట్మెంట్లను సిఫారసు చేయడం సంస్థ బోర్డ్ చెల్లింపు పరిధిలో లేదని APSEZ తెలియజేసింది.

దీనికి ముందు డెలాయిట్ మే నెలలో సంబంధం లేని పార్టీలతో జరిగిన మూడు లావాదేవీలను ఫ్లాగ్ చేసింది. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో వీటిని డెలాయిట్ గుర్తించింది. దీనికి అనగుణంగా అదానీ పోర్ట్స్ కు చట్టబద్ధమైన ఆడిటర్ గా తాము కొనసాగటానికి ఇష్టపడటం లేదని, అందువల్ల రెండు సంస్థల మధ్య మధ్య క్లయింట్-ఆడిటర్ ఒప్పంద సంబంధాన్ని స్నేహపూర్వకంగా ముగించడానికి అంగీకరించబడినట్లు డెలాయిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications