ప్రధాని నరేంద్ర మోడీపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయకుండా నిరోధించాలని కోరుతూ నమోదైన పిటిషన్ పై ఢిల్లీలోని రోహిణీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ మేరకు బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC), వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇంటర్నెట్ ఆర్కైవ్లకు సమన్లు జారీ చేసింది. బినయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై అదనపు జిల్లా న్యాయమూర్తి రుచికా సింగ్లా ఆదేశాలు జారీచేశారు.
సమన్లు అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా లిఖిత పూర్వక వాంగ్మూలాన్ని దాఖలు చేయాలని కోర్టు ఆయా సంస్థలను ఆదేశించింది. మే 11న ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరగనుంది. సోషల్ మీడియా న్యాయవాది ముఖేష్ శర్మ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. అవమానకరంగా, పరువుకు భంగం కలిగేలా వ్యవహరించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పే విధంగా ఆదేశించాలని కోర్టు తలుపు తట్టారు. 10 లక్షల నష్టపరిహారాన్ని సైతం ఇప్పించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు.

రెండు వాల్యూమ్ల డాక్యుమెంటరీ సిరీస్ "ఇండియా: ది మోడీ క్వశ్చన్" ప్రసారాన్ని నిలుపుదల చేయాలని పిటిషనర్ బినయ్ కుమార్ సింగ్ కోర్టుని కోరారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) కు సంబంధించిన ఏదైనా ఇతర పరువు నష్టం కలిగించే అంశాలను ప్రచురించకుండా చూడాలని విన్నవించారు. RSS మరియు విశ్వ హిందూ పరిషత్ (VHP) పరువుకు భంగం కలిగించకుండా.. వికీమీడియా, ఇంటర్నెట్ ఆర్కైవ్స్ లేదా ఇతర ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ప్లాట్ ఫారమ్లపై వ్యవహరించకుడా నియంత్రించాలని విఙప్తి చేశారు.
భారత ప్రధాని మోడీకి మరియు దేశంలోని ముస్లిం మైనారిటీలకు మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు BBC తన డాక్యుమెంటరీలో పేర్కొంది. ఈ క్రమంలో విద్వేషపూరిత నేరాలు, విపరీత రాజకీయాలు ద్వారా ఆందోళనలు ఎక్కువవుతున్నట్లు తెలిపింది. ముస్లిం సమాజం లక్ష్యంగా పలు వ్యూహాలు జరుగుతున్నాయని వెల్లడించింది. భారత్ ను హిందూ దేశంగా మార్చాలనే ఉద్ధేశంతో ముస్లిం మహిళలపై అత్యాచారాలు సహా హింసకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది.

BJP, RSS, VHPల పైనా BBC పలు ఆరోపణలు చేసింది. మత ఘర్షణల కారణంగా కనీసం 2 వేల మంది హత్యకు గురయ్యారని చెప్పింది. క్లెయిమ్ల ప్రామాణికతను ధృవీకరించకుండా వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన పుకార్లను ప్రచారం చేసిందని BBCపై ఆరోపణలు ఉన్నాయి. వీటివల్ల హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంపొందింది. దీంతో తన విశేష అధికారాలను ఉపయోగించి, చట్ట ప్రకారం డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేదించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications