ప్రముఖ వజ్రాల ఆభరణాల కంపెనీ డీప్ డైమండ్ స్టాక్ కేవలం 11 నెలల్లో పెట్టుబడిదారుల సొమ్మును 1288 శాతం పెంచింది. ఇప్పుడు కంపెనీ తమ స్టాక్ లను స్ల్పీట్ చేసింది. శుక్రవారం ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ను తాకింది. దాదాపు 5 శాతం లాభంతో రూ. 16 అప్పర్ సర్క్యూట్లో ఉన్నాయి. రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను రూ.1 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లుగా అంటే 1:10 నిష్పత్తిలో విభజించాలని కంపెనీ నిర్ణయిం తీసుకుంది.
డీప్ డైమండ్ షేర్లు కేవలం 11 నెలల్లో పెట్టుబడిదారులకు 1288 శాతం రాబడిని అందించాయి. గత ఏడాది ఫిబ్రవరి 23, 2022న ఈ స్టాక్ రూ.11 వద్ద ఉండగా, జనవరి 19న రూ.152.65 చేరింది. 11 నెలల్లో పెట్టుబడిదారులు పెట్టుబడి దాదాపు 14 రెట్లు పెరిగింది. గత సంవత్సరం అక్టోబర్ 25, 2022న, ఇది రికార్డు స్థాయిలో రూ. 171.95 వద్దకు చేరింది. ఇది స్టాక్ స్ప్లిట్ తర్వాత రూ. 17.20 స్థాయికి చేరింది.

డీప్ డైమండ్ అనేక రకాలైన 18k డైమండ్ ఆభరణాలను సేల్ చేస్తుంటుంది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా అతి తక్కువ ధరకే డైమండ్ జ్యువెలరీని అందజేస్తామని కంపెనీ వివరించింది. దాని ఆభరణాలన్నీ ఇంటర్నేషనల్ జెమాలజీ ఇన్స్టిట్యూట్ ( IGI ) గుర్తింపు ఉంది. BSEలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, త్రైమాసిక ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ 2022లో దాని నికర లాభం రూ. 43 లక్షల నుంచి రూ. 61 లక్షలకు పెరిగింది. అయితే ఆదాయం రూ.1.50 కోట్లకు తగ్గింది. ఈ స్టాక్ లో సంవత్సరం క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.13 లక్షలు అయ్యి ఉండేది.
Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నది. స్టాక్ ల్లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications