Davos 2025: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వార్తా పత్రిక చూసినా, ఏ వార్తా ఛానెల్ పెట్టినా వినిపిస్తున్న మాట ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనలే. వారు ఏఏ కంపెనీలతో చర్చలు జరిపారు, ఎంత మేర పెట్టుబడులను ఆకర్షించారు. ఈ క్రమంలో ఎవరెవరితో ఎంఓయూలు సంతకాలు చేసుకున్నారన్న విషయాలు ప్రధానంగా చర్చకు దారితీస్తున్నాయి.
వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం 2024లో దావోస్ పర్యటనలో దాదాపు రూ.40,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఈసారి తమ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులను సాధించటం లక్ష్యంగా దావోస్ పర్యటనను కొనసాగిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ లో ఈ సారి ఇప్పటి వరకు 14 కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు.

గతసారి పర్యటనలో 18 ప్రాజెక్టుల్లో 17 ఇప్పటికే వేరువేరు అమలు దశల్లో ఉన్నాయని చెప్పారు. కేవలం అదానీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు మాత్రమే పట్టాలు ఎక్కలేదని మిగిలిన ఒప్పందాలు కార్యరూపం దాల్చాయని వెల్లడించారు. అయితే ఈసారి తెలంగాణకు దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పెట్టుబడుల విషయంలో పేటీ పడుతున్నారా అని అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి బదులిస్తూ అలాంటిదేమీ లేదని బదులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ తమ సోదర రాష్ట్రమని, వారితో పోటీపడే ఉద్ధేశం తమకు లేదని పేర్కొన్నారు. ఎవరి అనుభవం వారిదేనని చంద్రబాబు గురించి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. తాను కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలతో కాకుండా సింగపూర్, దుబాయ్, న్యూయార్క్ వంటి దేశాలతో అభివృద్ధి విషయంలో పోటీపడుతున్నట్లు రేవంత్ బదులిచ్చారు. వ్యాపారులకు అనుకూలమైన స్థలంగా తనను తాను నిరూపించుకుందని, 30 ఏళ్లుగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలసీల రూపకల్పనను తాము కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రధానంగా ఐటీ, ఫార్మా, డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, స్కిల్ డెవల్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోందని దావోస్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రేవంత్ వెల్లడించారు. అనేక ఇతర రాష్ట్రాలు ఈ రంగాలపై ప్రస్తుతం పెట్టుబడుల ఆకర్షణలో ముందంజలో లేవని ఆయన పేర్కొన్నారు. అందువల్ల తమకు ఈ రంగాల్లో ఎలాంటి పోటీ కనిపించటం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాదులో భారీగా పెట్టుబడులను పెట్టిందని, తాము ఇన్వెస్టర్లకు అనుకూలమైన పాలసీలను తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లలో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications