లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
ముంబై: అమెరికాకు చెందిన డేటింగ్ యాప్ బంబుల్.. త్వరలో దేశీయ ఐపీఓ రంగంలోకి ప్రవేశించబోతోంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) జారీ చేయనున్నట్లు రెగ్యులేటరీ వద్ద దరఖాస్తులను దాఖలు చేసింది. ఇప్పటికే అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఎంట్రీ ఇచ్చిన బంబుల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అద్భుత ఫలితాలను రాబట్టుకుంది. గత ఏడాది మొత్తానికీ 168 బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది.
దేశీయ ఐపీఓ మార్కెట్లో అడుగు పెట్టడానికి ఉవ్విళ్లూరుతోంది. డేటింగ్కు సంబంధించిన ఓ యాప్.. దేశీయ ఐపీఓ మార్కెట్లో ప్రవేశించబోతోండటం ఇదే తొలిసారి అనే అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి. ప్రైవేట ఈక్విటీ సంస్థ బ్లాక్స్టోన్ గ్రూప్కు చెందిన బంబుల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్.. కొన్నేళ్లుగా అద్భుత యూఎస్ ఎక్స్ఛేంజ్లో మెరుగైన ఫలితాలను నమోదు చేస్తోంది. 2019లో 488.9 మిలియన్ డాలర్ల రెవెన్యూను ఆర్జించింది. మరుసటి ఏడాది నాటికి ఆ మొత్తం భారీగా పెరిగింది.
జనవరి 29 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో 376.6 మిలియన్ డాలర్లను ఆర్జించింది. ఏడాది ముగిసే సరికి ఈ మొత్తం 168 బిలియన్ డాలర్లకు చేరుకుంది. నిలకడగా ఆదాయాన్ని ఆర్జిస్తుండటం వల్ల అందరి కళ్లూ ఈ యాప్ పబ్లిక్ ఇష్యూ మీదే నిలిచాయి. ఎలాంటి ఐపీఓను ప్రకటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటింగ్ యాప్లతో పోల్చుకుంటే.. కాస్త భిన్నంగా ఉంటుంది ఇది. మహిళలు మాత్రమే దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది.
డేటింగ్ యాప్లో సమాచారాన్ని పోస్ట్ చేయాలన్నా.. స్వీకరించాలన్నా అది మహిళలకు మాత్రమే సాధ్యపడుతుంది. పబ్లిక్ ఇష్యూను ఎప్పుడు జారీ చేస్తుందనేది స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చేనెల 14వ తేదీన ఐపీఓను జారీ చేస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదివరకు ప్రేమికుల దినోత్సవం నాడే ఆ కంపెనీ యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో అడుగు పెట్టింది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందనే అంచనాలు ఉన్నాయి.