కరోనా మహమ్మారి, లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, చాలామంది ఇళ్లకే పరిమితం కావడంతో అందరి చూపు పెట్టుబడులపై పడింది. గత కొద్ది రోజులుగా చిన్న ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. క్రమంగా చాలామంది ఈక్విటీ మార్కెట్పై ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ నెలలో సెన్సెక్స్ 7.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. జూలైలోను ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మార్కెట్ జోరందుకుంది. అందుకు తగినట్లుగా కొత్త ఇన్వెస్టర్లు చేరుతున్నారు.

ముందున్న తెలుగు రాష్ట్రాలు
జూలై 20వ తేదీ నుండి జూలై 23వ తేదీ మధ్య అంటే ఈ నాలుగు రోజుల్లో ఏకంగా 1.5 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయ్యారు. నెల రోజుల్లో 11 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. బీఎస్ఈలో మొత్తం 5.2 కోట్ల మంది ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయ్యారు. ఏడాది కాలంలో ఈ సంఖ్య 1.3 కోట్లుగా ఉంది. ప్రతి నెల ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. గత నాలుగు రోజుల్లో లక్షన్నర నుండి రెండు లక్షల మంది ఇన్వెస్టర్లు రిజిస్టర్ కాగా, ఇందులోతెలుగు రాష్ట్రాలు కూడా ముందున్నాయి. జూలై 20 నుండి 23 మధ్య మహారాష్ట్ర నుండి 30వేల మందికి పైగా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి 10వేల చొప్పున, తెలంగాణలో 9వేల మందికి పైగా రిజిస్టర్ అయ్యారు. ఏపీ రెండో స్థానంలో, తెలంగాణ ఐదో స్థానంలో ఉంది.

పెట్టుబడులవైపు మొగ్గు ఎందుకు..
- కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి వద్దనే ఉండటంతో చేతిలోని నగదును ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం చిక్కింది. దీంతో ఈక్విటీలు, బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.
- రియల్ ఎస్టేట్, భూములు వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తం అవసరం. కానీ ఈక్విటీలో పెట్టుబడులకు చిన్న మొత్తాలు సరిపోతాయి. దీంతో ఈ లాక్ డౌన్ అనంతరం ఈక్విటీని ఎంచుకుంటున్నారు.
- మార్చిలో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆ సమయంలో పెట్టుబడుల వైపు చాలామంది ఆసక్తి కనబరిచారు.
- రికవరీ ర్యాలీ చాలామందికి సానుకూలంగా కనిపిస్తోంది.
- భారత్లో బెట్టింగ్ చట్టబద్దం కాకపోవడంతో ఖాళీ సమయాన్ని గడిపేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో ట్రేడింగ్ పట్ల ఆకర్షితులయ్యారు.

11 ఏళ్ల తర్వాత...
మార్చి 23వ తేదీన సూచీలు కనిష్టానికి పడిపోయాయి. అప్పటి నుండి స్టాక్ మార్కెట్లు 32 శాతం మేర లాభపడ్డాయి. 2009 జూన్ సెన్సెక్స్ అత్యధికంగా 7.8 శాతం లాభపడింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత జూన్ నెలలో ఆ స్థాయిలో లాభాలు వచ్చాయి. జూన్ ర్యాలీ జూలైలోను కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వివిధ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే దిగ్గజ రిలయన్స్ నెల రోజుల్లోనే భారీ రిటర్న్స్ ఇవ్వగా, నిన్న లిస్ట్ అయిన రోజరీ బయోటెక్ భారీ లాభాల్లో ఉంది.

రిలయన్స్ రికార్డ్, రోజరీ ప్రారంభంలోనే జూమ్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. రూ.2వేలు దాటి రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం సమయానికి మరో 3.6 శాతం ఎగిసి రూ.2,131 పలికింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14 లక్షల కోట్లసమీపానికి చేరుకుంది. నెల రోజుల్లోనే 22 శాతం లాభపడింది.

రోజరీ బయోటెక్
గత అయిదేళ్ల కాలంలో లిస్టయిన తొలిరోజు 75 శాతం జంప్ అయిన రికార్డ్ సృష్టించింది రోజరీ బయోటెక్. రోజరీ బయెటెక్ షేర్ ధర ఈ రోజు మధ్యాహ్నం 1.71 శాతం ఎగిసి రూ.755 పలికింది. ఇష్యూ ధర రూ.425 కాగా నిన్న రూ.742 వద్ద ముగిసింది. ఈ రోజు మరింత ఎగిసింది. గత అయిదేళ్ల కాలంలో 11 కంపెనీలు మాత్రమే లిస్టింగ్లో 50 శాతానికి పైగా లాభపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తొలిరోజు 30 లక్షలకు పైగా షేర్లు చేతులు మారాయని తెలుస్తోంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications