Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచి దానాపూర్, బెంగళూరుకు డైలీ రైలు సర్వీసులు..

బెంగళూరు వాసులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దానాపూర్-ఎస్ఎమ్‌విటి బెంగళూరు-దానాపూర్ స్పెషల్ రైలు సర్వీసులను క్రమబద్ధీకరించింది. ఇకపై అవి రోజువారీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా నడుస్తాయి. 22365/22366 నంబర్ల రైలు దానాపూర్ సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎమ్‌విటి) బెంగళూరు మధ్య వెళ్లి తిరిగి వస్తుంది. ఈ రోజువారీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పెరంబూర్, కాట్పాడి మరియు జోలార్‌పేట మీదుగా నడుస్తాయి. దానాపూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 22365) సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2.45 గంటలకు దానాపూర్ నుంచి బయలుదేరుతుంది. ఇది సెప్టెంబర్ 2న సాయంత్రం 7 గంటలకు వరంగల్ చేరుకుని, రెండు నిమిషాల తర్వాత సాయంత్రం 7.02 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. ఈ రైలు విజయవాడ మీదుగా ప్రయాణించి సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.

అదేవిధంగా బెంగళూరు-దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 22366) సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి 11.30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరుతుంది. ఇది సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6.18 గంటలకు వరంగల్ చేరుకుని, రెండు నిమిషాల విరామం తర్వాత సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు విజయవాడ మీదుగా ప్రయాణించి సెప్టెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12.15 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. దానాపూర్-బెంగళూరు మార్గాల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ప్రయాణికులకు ఉపశమనం కలిగించడం లక్ష్యంగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని ఇటీవలే తూర్పు మధ్య రైల్వే నిర్ణయించింది.

Train

సెప్టెంబర్ 1 నుంచి ప్రతిరోజూ నడిచే దానాపూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు దానాపూర్ నుంచి బయలుదేరి, తన ప్రయాణంలో మూడో రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణ సర్వీసు సెప్టెంబర్ 3న బెంగళూరు నుంచి ప్రారంభమవుతుందని చంద్ర తెలిపారు. ఈ రైలు రాత్రి 11.50 గంటలకు బయలుదేరి, మూడవ రోజు తెల్లవారుజామున 12.15 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. దానాపూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో రెండు ఏసీ టూ-టైర్ కోచ్‌లు, మూడు ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, 10 స్లీపర్ కోచ్‌లు, ఏడు జనరల్ కోచ్‌లు, రెండు బ్రేక్ వ్యాన్‌లతో సహా మొత్తం 24 కోచ్‌లు ఉంటాయని ప్రకటించింది. దీంతో పాటు అహ్మదాబాద్-భాగల్పూర్ రైలును కూడా ప్రకటించింది.

వారానికి ఒకసారి నడిచే అహ్మదాబాద్-భాగల్పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 26న DDU-పాట్నా-కియుల్ మార్గం ద్వారా తన సేవలను ప్రారంభిస్తుందని తూర్పు మధ్య రైల్వే (CPRO) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సరస్వతి చంద్ర తెలిపారు. ఈ రెండు కొత్త రైళ్ల ప్రవేశంతో సుదూర ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని తూర్పు మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే అధిక ప్రయాణికుల రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు రవాణా సౌకర్యాలు లభిస్తాయని పేర్కొంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+