DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్న్యూస్!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ రానుందా? అంటే మరోసారి ఉద్యోగులకు డీఏ పెంపుకు అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగులకు ఈ శుభవార్త అందించవచ్చు. ఈసారి డియర్నెస్ అలవెన్స్ (DA) మూడు శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. పద్దెనిమిది నెలలుగా డీఏ ఎర్రీర్స్ కోసం వేచిచూస్తున్న ఉద్యోగులకు ఇది బిగ్ రిలీఫ్.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అలవెన్స్ రేట్ను 17 శాతం నుండి 28 శాతానికి పెంచింది. అక్టోబర్ నెలలో దీనిని మరో మూడు శాతం పెంచింది. ఏడో వేతన సంఘం సిఫార్సు మేరకు ఉద్యోగులకు డీఏను 3 శాతం పెంచి, కొత్త సంవత్సరంలో శుభవార్త అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు కేంద్రం ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ పెంచుతుంది. ప్రభుత్వరంగ ఉద్యోగుల స్థూల వేతనంలో అధిక భాగాన్ని డీఏ భర్తీ చేస్తుంది. ప్రధానంగా ద్రవ్యోల్భణం ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ మొత్తాన్ని ఉద్యోగులకు ఇస్తారు. ప్రస్తుతం కేంద్రం ఉద్యోగులకు 31 శాతం డియర్నెస్ అలవెన్స్ చెల్లిస్తోంది.