విశాఖపట్నంలో ఆధునిక నగర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. త్వరలోనే సైక్లింగ్ ట్రాక్లను వైజాగ్లో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాల గందరగోళంపై ఇటీవల వచ్చిన విమర్శల సందర్భంలో.. విశాఖపట్నం పచ్చదనం, ఫుట్పాత్ అభివృద్ధిని ప్రశంసించిన ఓ పోస్ట్కు ప్రత్యుత్తరంగా ట్రాక్ల ప్రణాళికను సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ X (పూర్వం ట్విట్టర్)లో సివిక్ అపోజిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ బెంగళూరులోని విపరీతమైన రోడ్ల, ట్రాఫిక్ సమస్యలతో పోల్చుతూ, విశాఖపట్నం ఫుట్పాత్లు, చెట్లు, పచ్చని వాతావరణం నగర రూపాన్ని మార్చిపోతున్నాయని ప్రశంసించింది. అక్కడితో ఆగకుండా, వైజాగ్లో సైక్లింగ్ లేన్లు ఏర్పాటు చేస్తే, భారతదేశానికి తదుపరి తరం ఐటీ ప్రోత్సాహం అందించగలిగే పర్యావరణ అనుకూల నగరంగా అవతరిస్తుందని సూచించింది.

ఈ అభ్యర్థనకు స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ నగరాన్ని మరింత అందంగా, నివాసయోగ్యంగా మారుస్తాం. ప్రజల జీవిత అనుభవాన్ని నిరంతరం మెరుగుపరుస్తాము. సైక్లింగ్ ట్రాక్లు మా తదుపరి దశ అభివృద్ధిలో భాగమవుతాయని ప్రతిజ్ఞ చేశారు. పట్టణాల్లో పర్యావరణ సమతుల్యతలో భాగంగా ఆరోగ్యాన్ని ప్రోత్సహించే రవాణా పద్ధతుల కోసం సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటీవలి నెలల్లో బెంగళూరు మౌలిక సదుపాయాల దిగజారుడుపై వ్యాపార వర్గాలు, పరిశ్రమ నాయకులు, సామాన్య ప్రజలు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా, నగరంలోని గుంతలు, చెత్త, విరిగిన రోడ్లు, ట్రాఫిక్ జాం వంటి సమస్యలను తీవ్రంగా ప్రశ్నిస్తూ, ఇలాంటి పరిస్థితులు పెట్టుబడి వాతావరణానికి, నగర జీవన ప్రమాణాలకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
లాజిస్టిక్స్-టెక్నాలజీ కంపెనీ బ్లాక్బక్.. ఔటర్ రింగ్ రోడ్పై ఉన్న తమ కార్యాలయాన్ని రోడ్ల దుస్థితి, నిరంతర ట్రాఫిక్ సమస్యల కారణంగా ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. ఇదే సమయంలో, సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్.. తన ఫ్లైట్ మిస్సయిందని దీనికి కారణం గంటకు పైగా ట్రాఫిక్లో చిక్కుకోవడమేనని తన అనుభవాన్ని పంచుకుంటూ బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను పనికిరాని, బాధ్యతారహితులని అభివర్ణించారు.
ఇక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్.. బెంగళూరు సమస్యలను ఉదాహరణగా చూపిస్తూ, Vizag ను సంస్థలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా ప్రచారం చేస్తున్నారు. ఐటీ సంస్థలు, స్టార్టప్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్, పరిశోధన సంస్థలకు విశాఖపట్నం బలమైన మౌలిక సదుపాయాలను, ప్రశాంత వాతావరణాన్ని, శుభ్రమైన నగరీకరణను అందించగలదని వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, విశాఖపట్నంలో ఫుట్పాత్లు, పచ్చని ప్రజా స్థలాలు, ప్రవేశపెట్టబోతున్న సైక్లింగ్ ట్రాక్లు అనే మూడు ముఖ్యమైన అంశాలపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టడం, వేగంగా పెరుగుతున్న నగరాల్లో ఆరోగ్యకరమైన రవాణా, పర్యావరణ రక్షణకు ప్రాధాన్యం ఇచ్చే సంకేతాలు అందిస్తోంది. ఇది ప్రస్తుతం మౌలిక సదుపాయాల సంక్షోభంలో చిక్కుకున్న బెంగళూరుతో స్పష్టమైన పోలికగా నిలుస్తోంది.వైజాగ్ను భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన, అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని అధికార వర్గాలు చెబుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications