బిట్ కాయిన్, ఎథేరియం భారీ జంప్: క్రిప్టో కరెన్సీ పుంజుకుంటోంది
క్రిప్టో కరెన్సీ మళ్లీ పుంజుకుంది. అంతకుముందు భారీగా నష్టపోయిన డిజిటల్ కాయిన్స్ రెండు రోజులుగా కాస్త లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఇరవై నాలుగు గంటల్లో 3.19 శాతం లాభపడి 2.07 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 12.10 శాతం ఎగిసి 99.50 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 43,000 డాలర్లను క్రాస్ చేసింది. 44,000 డాలర్లను దాటినప్పటికీ, ఈ క్రిప్టో నేడు (ఈ వార్త రాసే సమయానికి) స్వల్పంగా నష్టపోయి 43,200 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. నేడు 44,350 డాలర్లను క్రాస్ చేసింది. క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ వాటా 0.34 శాతం క్షీణించి 39.88 శాతానికి చేరుకుంది.
భారత కరెన్సీలో బిట్ కాయిన్ 1.95 శాతం లాభపడి రూ.34,59,163, ఎథేరియం 2.76 శాతం ఎగిసి రూ.2,64,569.9, కార్డానో 9.4 శాతం ఎగిసి రూ.104.48, అవాలాంచె 4.94 శాతం లాభపడి రూ.7,452.81, పోల్కాడాట్ 4.06 శాతం లాభపడి రూ.2,129.46, లైట్ కాయిన్ 6.05 శాతం ఎగిసి రూ.11,101.35 పలికాయి. టెథేర్ మాత్రం 0.63 శాతం క్షీణించి 79.23 వద్ద ట్రేడ్ అయింది. మీమ్ కాయిన్స్ షిబా ఇను 13.68 శాతం, డోజీకాయిన్ 6.73 శాతం లాభపడింది.