Crude Oil: పెరిగిన చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా.!

గతేడాది చివరి నుంచి ఎర్ర సముద్రంలో షిప్పింగ్‌పై ఇరాన్-మద్దతుగల హౌతీ తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు. దీంతో సరకు రవాణా ఇబ్బందిగా మారింది. హౌతీ దాడులకు ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ సైనిక లక్ష్యాలపై యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ దాడులు చేశాయి. దీంతో శుక్రవారం చమురు ధరలు 2 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.53 డారల్లు పెరిగి బ్యారెల్‌కి 78.94 డాలరకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.53 డాలర్లు పెరిగి 73.55 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం. క్రూడ్ ఆయిల్ ధరలు ఇలానే పెరుగుతూ పోతే.. భారత్ వంటి దేశాలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్, పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధంతో హౌతీ తీవ్రవాదులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. పలు నౌకలను హైజాక్ కూడా చేస్తున్నారు. దీంతో చాలా వాణిజ్య నౌకలు తిరిగి రావాల్సి వస్తుంది. దీంతో ఖర్చు పెరుగుతోంది.

Crude oil prices surged after US strikes on Houthi terrorist bases

ఈ నేపథ్యంలోనే అమెరికా, బ్రిటన్ హౌతీ తీవ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. యునైటెడ్ స్టేట్స్, దాని భాగస్వాములు తమ సిబ్బందిపై దాడులను సహించరు లేదా "నావిగేషన్ స్వేచ్ఛను దెబ్బతీసేందుకు శత్రు నటులను అనుమతించరు" అని యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ అన్నారు. ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ ఆపరేషన్‌కు మద్దతు ఇచ్చాయని ఆయన చెప్పారు.

ఎర్ర సముద్రంలో హౌతీ దాడులు యూరప్ మరియు ఆసియా మధ్య కీలక మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగించాయి. ఇది ప్రపంచంలోని షిప్పింగ్ ట్రాఫిక్‌లో 15% వాటాను కలిగి ఉంది. అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్‌పై పోరాటంలో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు మద్దతునిచ్చేందుకు హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడి చేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+