భగ్గుమన్న ముడి చమురు ధరలు.. అమెరికా-ఇరాన్ దాడులతో ఒకేసారి 4 శాతం జంప్.. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధి వేదికగా యుద్ధ వాతావరణం నెలకొంది. హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలతో అమెరికా, ఇరాన్‌ల మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రాత్రికి రాత్రే సుమారు 4 శాతం మేర భగ్గుమన్నాయి. ఈ పరిణామాల వల్ల యూఎస్ ముడి చమురు (WTI) 4.1 శాతం పెరిగి బ్యారెల్‌కు 74.33 డాలర్లకు చేరుకోగా.. బ్రెంట్ ముడి చమురు ధర కూడా 3.88 శాతం వృద్ధి చెంది బ్యారెల్‌కు 78.96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇరు దేశాలు సైనిక వ్యూహాలపై దాడులు చేసుకోవడం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ ఉద్రిక్తతలకు సంబంధించి ఆదివారం నాడు ఇరాన్‌పై అమెరికా మరో దాడుల పరంపరను ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అంతకుముందు శనివారం రోజే ఇరాన్‌కు చెందిన 140 లక్ష్యాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక అంతర్జాతీయ కంటైనర్ నౌకపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దాడి చేసింది. దానికి ప్రతిచర్యగా గత వారంలో అమెరికా ఇరాన్‌పై బాంబు దాడులు చేసింది. ఇలా చేయడం వరుసగా నాలుగోసారి అని చెప్పవచ్చు. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఆదివారం నాడు జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, ఒమన్‌లలోని యూఎస్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో విరుచుకుపడిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిమ్ ధృవీకరించింది.

Crude Oil Prices Brent Crude Brent Crude Price US Iran Tensions Oil Prices Crude Oil Global Oil Market Brent Above 78 Petrol Prices Diesel Prices Energy Market Middle East Tensions Business News Oil Market News

ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని మూసివేయడంపై ఇరు దేశాల మధ్య తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు తాము జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించగా.. ఆ వాదనను అమెరికా సైన్యం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ సముద్ర మార్గం అన్ని చట్టబద్ధమైన నౌకలకు తెరిచే ఉందని, రవాణా కొనసాగుతోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.

Also Read

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎన్‌బిసి న్యూస్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ హార్ముజ్ జలసంధి తెరిచే ఉందని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా విండ్‌వార్డ్ అనే సముద్ర నిఘా సంస్థ నివేదిక ప్రకారం శనివారం ఈ మార్గం గుండా తొమ్మిది వాణిజ్య నౌకలు ప్రయాణించాయి. అలాగే ఒమన్ జలాల్లోకి ప్రవేశించే, బయటకు వెళ్లే నౌకలకు దక్షిణ మార్గం తెరిచే ఉందని బహ్రెయిన్‌లోని అమెరికా నావికా కూటమికి చెందిన సంయుక్త సముద్ర సమాచార కేంద్రం తెలిపింది. అయితే అక్కడ భద్రతా పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నందున.. ఆ ప్రాంతం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని భద్రతా సంస్థలు హెచ్చరించాయి.

ఈ వివాదానికి ప్రధాన కారణం జూన్ 17న అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందమేనని నివేదికలు చెబుతున్నాయి. ఆ ఒప్పందం కింద హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై ఇరు దేశాల మధ్య వ్యక్తమైన భిన్నాభిప్రాయాలే ప్రస్తుత ఉద్రిక్తతలకు దారితీశాయని చెప్పవచ్చు. నౌకలు తమ సముద్ర సరిహద్దు వెంబడి ఉన్న ఉత్తర మార్గాన్ని మాత్రమే ఉపయోగించాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఆ జలసంధిపై తమకే పూర్తి నియంత్రణ ఉందని వాదిస్తోంది.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడానికి ముందు.. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ హార్ముజ్ జలసంధి గుండానే సాగేది. మార్చి ఆరంభంలో ఇరాన్ అంతర్జాతీయ నౌకలపై దాడులు మొదలుపెట్టిన తర్వాత ఈ మార్గంలో రవాణా గణనీయంగా తగ్గినప్పటికీ.. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందం తర్వాతే నౌకల రాకపోకలు మళ్లీ సాగించాయి. అయితే తాజా ఘర్షణల వల్ల ఈ కీలక అంతర్జాతీయ వాణిజ్య మార్గం మళ్లీ సంక్షోభంలో పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+