భారతదేశంలో ఆవులను పాల కోసం కొన్ని శతాబ్దాలుగా పెంపకం చేస్తున్నారు. కానీ, దాని పేడలో కూడా ఎన్నో లక్షణాలు ఉన్నాయి, దీని కారణంగా ఆవు పేడని వ్యవసాయంలో ఎరువుగా కూడా ఉపయోగిస్తారు. ఆవు పేడను పెద్ద ఎత్తున ఎరువుగా ఉపయోగించే రైతులను ఇండియాలో చాలా మందిని మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు విదేశాల్లో కూడా ఈ ట్రెండ్ మొదలైంది. దింతో ఆవు పేడకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భారతదేశం ఏ దేశాలకు ఆవు పేడను ఎగుమతి చేస్తుందో తెలుసా... అతిపెద్ద విషయం ఏమిటంటే, ఈ ఎగుమతి కేవలం 10 లేదా 20 కోట్ల విలువైనది కాదు, ఏకంగా వందల కోట్ల విలువైనది. ఈ దేశాల్లో చైనా, అమెరికాతో పాటు కొన్ని అరబ్ దేశాలు కూడా ఉన్నాయి.
2023-24లో ఎన్ని వందల కోట్ల విలువైన ఆవు పేడను ఎగుమతి చేసిందంటే ?
ఎక్సింపీడియా నివేదిక ప్రకారం, 2023-24 సంవత్సరంలో భారతదేశం మొత్తం రూ.125 కోట్ల విలువైన ఫ్రెష్ ఆవు పేడను ఎగుమతి చేసింది. దీంతోపాటు రూ.173.57 కోట్ల విలువైన ఆవు పేడతో తయారు చేసిన ఎరువుని ఎగుమతి చేశారు. ఇంకా 88.02 కోట్ల విలువైన ఆవు పేడను కంపోస్టుగా ఎగుమతి చేయగా ఈ మొత్తం కలిపితే దాదాపు రూ.386 కోట్లు అవుతుంది. అంటే ఒక్క ఏడాదిలో భారత్ రూ.386 కోట్ల విలువైన ఆవు పేడను ఇతర దేశాలకు విక్రయించింది.

ఏ దేశాలు ఆవు పేడను ఎక్కువగా కొన్నాయంటే
భారతదేశం నుండి ఆవు పేడను కొనుగోలు చేసే టాప్ 10 దేశాల గురించి మనం మాట్లాడితే, మాల్దీవులు మొదటి స్థానంలో ఉండగా దీని తర్వాత అమెరికా వస్తుంది. ఈ లిస్టులో సింగపూర్ మూడో స్థానంలో, చైనా నాలుగో స్థానంలో, నేపాల్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఆవు పేడను కొనుగోలు చేసే దేశాల లిస్టులో బ్రెజిల్ 6వ స్థానంలో ఉండగా, అర్జెంటీనా 7వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 8వ స్థానంలో, కువైట్ 9వ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 10వ స్థానంలో ఉంది.
ఆవు పేడతో అరబ్ దేశాలు ఏమి చేస్తాయంటే
ఇతర దేశాలలాగానే ఇక్కడ కూడా ఆవు పేడను ఎక్కువగా వ్యవసాయానికి ఉపయోగిస్తారు. అయితే, ఈ పంటల సాగు కూరగాయలు, ధాన్యాలు కాదు కానీ ఖర్జూరం పంట కోసం. ఇక్కడి పెద్ద రైతులు భారతదేశం నుండి ఆవు పేడను దిగుమతి చేసుకుంటారు, దాని పొడిలాగ తయారు చేసి ఖర్జూరం చెట్ల వేర్ల దగ్గర పోస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా చేయడం వల్ల ఖర్జూరాల దిగుబడి మరింత పెరుగుతుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications