కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై రిటైలర్ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆదాయమే లేని సమయంలో కేంద్రం నుండి మద్దతు జీరో అని అసహనం వ్యక్తం చేసింది. ఈ రంగంలో 4.6 మిలియన్ల మంది ఉద్యోగ, ఉపాధి పొందుతున్నారి, 20 మిలియన్ల మంది నాన్-ఎసెన్షియల్ రిటైలర్స్లో ఉన్నారని తెలిపింది. ఇండియా వినియోగంలో రిటైల్ ఇండస్ట్రీ వాటా 40 శాతంగా ఉంటుందని, జీడీపీలో 10 శాతం వాటా ఉంటుందని గుర్తు చేశారు.

వేతనాలు, వడ్డీలు, రుణాలు, పన్నులతో సంక్షోభంలోకి..
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎకనమిక్ ప్యాకేజీలో తమను పూర్తిగా విస్మరించారని 7 కోట్ల మంది వ్యాపారులు కలిగిన ఈ ఆర్గనైజేషన్ నిరాశ వ్యక్తం చేసింది. ప్రతి వ్యాపారికి వేదనను మిగిల్చిందని, ఆర్థిక ప్యాకేజీ కోసం ఎంతగానో ఎదురు చూశారని పేర్కొంది. CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత భారీ సంక్షోభం కనిపించడం ఖాయమని, వ్యాపారులు వేతనాలు, వడ్డీలు, బ్యాంకు రుణాలు, పన్నులు చెల్లించవలసి ఉంటుందని, అప్పుడు సంక్షోభంలో కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

మోడీ ప్యాకేజీ దీర్ఘకాలంలో భేష్..
దాదాపు 20 శాతం మంది వ్యాపారులు తమ వ్యాపారాలను పూర్తిగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని CAIT తెలిపింది. ఈ 20 శాతంపై ఆధారపడిన మరో 10 శాతం మంది ట్రేడర్స్ కూడా చితికిపోతారని తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ ఆర్థిక ఉద్దీపన కింద కేంద్రం తీసుకున్న చర్యలు దేశానికి దీర్ఘకాలంలో ఉపయోగపడతాయని, కానీ రిటైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేవని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(RAI) సీఈవో కుమార్ రాజగోపాలన్ అన్నారు. తమని ఏమాత్రం ఆదుకోలేదనన్నారు.

వేతనం, మూలధన రూపాల్లో మద్దతు అవసరం
చిల్లర వ్యాపారులకు కనీస వేతన మద్దతు, తీసుకున్న రుణాలు వాటి వడ్డీలపై మారటోరియం మద్దతు, మూలధనం రూపంలో మద్దతు అవసరమని రాజగోపాలన్ చెప్పారు. రిటైలర్స్ మనుగడ సాధించడానికి ఇవి చాలా కీలకమని చెప్పారు.

ఎంఎస్ఎంఈలతో మాకేం ప్రయోజనం
ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం అందించే సహాయక చర్యలు చిల్లర వ్యాపారులకు ఏమాత్రం సహాయం చేయవని చెప్పారు. ఎందుకంటే రిటైల్.. ఎంఎస్ఎంఈ సెక్టార్ కిందకు రాదన్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే వ్యాపారాలు మూతపడుతాయన్నారు. రిటైల్ వ్యాపారుల చేతుల్లో ఇప్పుడు మూలధనం అవసరమని, లేదంటే ఈ రంగంలోని 4.6 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు హాని
కరోనా - లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఆదాయం లేదని, అలాగే ప్రభుత్వం నుండి మద్దతు జీరో అని, ఇలాంటి పరిస్థితుల్లో మనలేదని రాజగోపాలన్ అన్నారు. అదే జరిగితే వినియోగం కూడా భారీగా తగ్గిపోతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు, దేశానికి మరింత హానీ కలిగిస్తుందన్నారు. కాగా, రుణాలపై మారటోరియంతో పాటు ఉద్యోగులకు వేతనాల సహకారం, అద్దెకు మద్దతు వంటి ఉపశమనాలు కోరింది. కానీ ప్యాకేజీలో ఇవి బాగం కాలేదు.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications