COVID 19 Deaths: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పాలసీ వర్తిస్తుందా?

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJBY) పాలసీ కొనుగోలు చేస్తే కరోనాతో మరణించినా పరిహారం లభిస్తుందా, వస్తే ఎంత వస్తుందనేది కొంతమందికి ఉన్న సందేహం. PMJJBY, PMSBY పథకాలు తక్కువ ఖర్చుతో బీమా సౌకర్యం తీసుకు వచ్చేందుకు తెచ్చిన పథకాలు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తులు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మృతి చెందితే బీమా పరిహారం నామినీకి వస్తుంది. ఈ వివరాలు తెలుసుకుందాం....

PMSBY-ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీకి ప్రీమియం రూ.12. గుర్తింపు పొందిన బ్యాంకులలో పొదుపు ఖాతా ఉన్న 18 సంవత్సరాల నుండి 70 ఏళ్ల వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రమాదంలో పాలసీదారు మృతి చెందితో రూ.2 లక్షలు, శాశ్వత వైకల్యమైతే రూ.1 లక్ష వస్తుంది. కరోనా మరణాలకు ఈ పాలసీకి సంబంధం లేదు.

COVID 19 Deaths: Nominees can claim Rs 2 lakh under PMJJBY

మరో పాలసీ PMJJBY. ఆ పాలసీకి ప్రీమియం రూ.330. బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా ఉంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్కులు అర్హులు. ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలున్నా పాలసీ ఒకటే ఇస్తారు. ఇది ఏటా జూన్ 1వ తేదీ నుండి ప్రారంభమౌతుంది. ఈ పథకంలో కొత్తగా చేరిన 45 రోజుల తర్వాత మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ పాలసీ తీసుకుంటే ఏ కారణంతో మరణించినా రూ.2లక్షల బీమా పరిహారం అందుతుంది. హత్య, ఆత్మహత్యలకు వర్తిస్తుంది. కరోనాతో మరణించినా వారికి ఈ బీమా పాలసీ రూ.2 లక్షల పరిహారం వస్తుంది.

ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే నామినీలు 30 రోజుల్లోగా పాలసీ ఉన్న బ్యాంకు శాఖను సంప్రదించి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. క్లెయిమ్ సమర్పించిన 30 రోజుల్లోగా బ్యాంకు ఆ క్లెయిమ్ ఫారాన్ని సంబంధింత బీమా కంపెనీకి పంపిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+