కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. మహింద్రా గ్రూప్కు చెందిన కొటక్ మహీంద్రా బ్యాంకు తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ బ్యాంకుల శాఖల్లోని కాంటాక్ట్ సెంటర్లలో పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. కస్టమర్లు తమ ఇళ్ల నుండే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలని సూచిస్తోంది.

బ్యాంకు వేళల్లో మార్పులు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బ్యాంకుల్లో సిబ్బందిని పరిమితం చేశారు. 20 మార్చి 2020 నుండి కొటక్ మహీంద్రా బ్యాంకులు కేవలం ఉదయం గం.10 నుండి మధ్యాహ్నం గం.2 వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. సాధ్యమైన ప్రతిచోట వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. ఉద్యోగులకు రిమోట్ యాక్సెస్ సౌకర్యం కల్పించేందుకు సంస్థకు సురక్షిత యంత్రాంగం ఉంది. ఇది భద్రతా ప్రోటోకాల్కు ఇబ్బందుల్లేకుండా ఉంటుంది.

శానిటైజర్లు, మాస్కులు
కార్యాలయాలు, బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగుల రక్షణ కోసం శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచారు. వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన ఆరోగ్య సలహాలు అనుసరింప చేస్తున్నారు. అవసరమైనచోట శానిటైజేషన్ చేస్తున్నారు.

వైద్య పరీక్షలు
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందరు కూడా కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. ప్రయివేటు ల్యాబ్లలో అయ్యే ఖర్చు రీయింబర్సుమెంట్ ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు, ఈసారి వేతనాలు కూడా ముందే అందిస్తోంది. ఈ రోజే (మార్చి 26) కొటక్ ఉద్యోగుల చేతికి వేతనాలు రానున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications