ముంబై: స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. గత వారం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఈ వారం కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సోమవారం (మార్చి 16) ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 1,520.53 పాయింట్లు (4.46 శాతం) నష్టపోయి 32582.95 పాయింట్ల వద్ద, నిఫ్టీ 440.60 (4.43 శాతం) నష్టపోయి 9514.60 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 2,000 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత 1500 వద్ద కనిపించింది. 190 షేర్లు లాభాల్లో, 730 షేర్లు నష్టాల్లో ఉండగా, 62 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు అతలాకుతలం

యస్ బ్యాంకు 40 శాతం జూమ్
యస్ బ్యాంకు భారీగా పుంజుకుంది. ఏకంగా దాదాపు 40 శాతం ఎగిసింది. HDFC, ICICI బ్యాంకు, SBI, సన్ ఫార్మా, JSPL, మ్యాక్స్ ఫైనాన్షియల్, DLF నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఒక యస్ బ్యాంకు మాత్రమే ఉంది. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.

ఎస్బీఐ కార్డ్స్
ఎస్బీఐ కార్డ్స్ ప్రీ ఓపెన్ రూ.661 వద్ద ప్రారంభమైంది. ఎస్బీఐ కార్డ్స్ లిస్టింగ్ సమయంలో ఎస్బీఐ షేర్లు కూడా 8 శాతం మేర నష్టపోయాయి. కరోనా వైరస్ ప్రభావం ఎస్బీఐ కార్డ్స్ లిస్టింగ్ పైన కూడా పడుతోంది.

మార్కెట్లకు కరోనా దెబ్బ
కరోనా వైరస్ దెబ్బతో గతవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. గత సోమవారం 3వేల పాయింట్లు, గురువారం అంతే మొత్తంలో నష్టపోయిన సెన్సెక్స్ శుక్రవారం కూడా 3వేల పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. కానీ సాయంత్రానికి కాస్త కోలుకొని లాభాల్లో ముగిసింది. వారాంతంలో లాభాల్లో ముగిసినప్పటికీ.. మొత్తంగా గత వారం మాత్రం భారీ నష్టాలను చవి చూశాయి.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 6 వేల మందికి పైగా మృత్యువాత పడగా, లక్షన్నర మందికి పైగా సోకింది. భారత్లో కరోనా సోకిన వారి సంఖ్య 110కి చేరుకుంది. ఇద్దరు మృతి చెందారు. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడుతోంది.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications