కరోనా మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరిగిందని ఎస్బీఐ పరిశోధనా సంస్థ ఎకొరాప్ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పటి వరకు రూ.30.3 లక్షల కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది, ఇది మొత్తం జీడీపీలో 13.5 శాతానికి సమానం అని వెల్లడించింది. దేశంలో ఐదు పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) నష్టం 50 శాతానికి సమీపంలో ఉందని తెలిపింది. ఈ ఐదు రాష్ట్రాల నష్టమే దాదాపు రూ.11 లక్షల కోట్లు అని పేర్కొంది.

కేంద్రం ప్యాకేజీ కంటే భారీ నష్టం
భారీగా నష్టాలు చవిచూసిన తొలి మూడు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ వంటి టాప్ టెన్ రాష్ట్రాల జీఎస్డీపీ నష్టం దాదాపు 75% వరకు ఉందని ఎస్బీఐ నివేదిక తెలిపింది. మొత్తం నష్టంలో ఆరెంజ్, రెడ్ జోన్ల వాటా 90% ఉందని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ కంటే ఈ నష్టం దాదాపు 50 శాతం ఎక్కువ అని వెల్లడించింది. ప్రతి రాష్ట్రంలో జోన్ వారీగా, జిల్లాల వారీగా అంచనా వేసినట్లు తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో మైనస్ 6.8 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏకంగా మైనస్ 6.8 శాతంగా ఉండవచ్చునని ఎస్బీఐ అంచనా వేసింది. 2020 మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 1.2 శాతానికి పడిపోనుందని ఎస్బీఐ ఎకోరప్ తన నివేదికలో అంచనా వేసింది. 2019-20లో వృద్ధి 4.2 శాతానికి పరిమితమయ్యే అవకాశముందని తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు క్వార్టర్లలో 5.1 శాతం, 5.6 శాతం, 4.7 శాతంగా నమోదయింది.

మార్చి ఏడు రోజుల్లో ఎంత నష్టమంటే
మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ కొనసాగుతోంది. మార్చి నెలలో ఏడు రోజులు ఈ లాక్ డౌన్ ఉంది. ఈ వారం రోజుల్లోనే ఏకంగా రూ.1.4 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. మర్కజ్ ఘటన వెలుగు చూసిన తర్వాత కేసులు ఎక్కువగా పెరిగాయి. ఇండియాలో ఇప్పటి వరకు 150,793 కేసులు ఉన్నాయి. 4,344 మరణాలు చోటు చేసుకున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

డబ్బు కావలిసినంత ఉన్నా పర్సనల్ లోన్ల వైపు పరిగెత్తుతున్న ధనవంతులు.. కారణం ఏంటంటే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications