మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం. మనకు ఏమైనా అయితే మనల్ని నమ్ముకున్నవారు ఇబ్బంది పడకూడదని పాలసీ తీసుకుంటాం. అయితే పాలసీ తీసుకునేటప్పుడు అన్ని బాగానే ఉంటాయి. ఒకవేళ ఏదైనా జరిగి క్లైమ్ చేసినప్పుడే కంపెనీ కథ తెలుస్తోంది. తాజాగా హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ క్లైమ్ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఏకంగా దొంగ పత్రాలనే సృష్టించింది.
అయితే చివరికి దొరికిపోయి అభాసుపాలయింది. బాధితుడు వినియోగదారుల కమిషన్ ఆశ్రయించడంతో హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ బండారం బయట పడింది. ఓ వైద్యుడి సంతకాలను ఫోర్జరీ చేసి ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు పత్రాలు సృష్టించిన హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ కంపెనీపై వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్లైమ్ డబ్బు రూ.75 లక్షలను 7 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. 2018 నుంచి ఈ వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడానికి చెందిన భాగ్యమ్మ 2016లో హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ టర్మ్ ప్లాన్ తీసుకున్నారు. రూ.75 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుని సంవత్సరానికి రూ.30 వేలు చెల్లించారు. అయితే భాగ్యమ్మ 2018లో గుండె పోటుతో చనిపోయారు. ఆ తర్వాత నామినిగా ఉన్న భర్త సహదేవ ఇన్సూరెన్స్ కోసం క్లైమ్ చేశాడు. అయితే హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ సహదేవ క్లైమ్ ను తిరస్కరించింది.
భాగ్యమ్మకు పాలసీ తీసుకోకముందే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆమె యాంజియో ప్లాస్టీ చేసుకున్నట్లు తమ విచారణ తేలిందని క్లైమ్ ను రిజెక్ట్ చేసింది. దీనిపై సహదవే వినియోగదారుల కమిషన్ కు వెళ్లారు. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ భాగ్యమ్మ పాలసీ తీసుకునేటప్పుడు అనారోగ్య సమస్యలు దాచినట్లు వాదించింది. భాగ్యమ్మ 2015 జూన్ 15 నుంచి 19 వరకు సిగ్మా అనే ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు వివరించింది. అందుకు సంబంధించిన పత్రాలు కూడా సమర్పించింది. సహదేవ మాత్రం తన భార్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. తాము సిగ్మా ఆస్పత్రికే వెళ్లలేదని వాదించాడు.
చికిత్స తీసుకున్న అని చెబుతున్న వైద్యుడిని పిలిచి విచారించాలని కోరాడు.దీంతో వినియోగదారుల కమిషన్ సిగ్మా వైద్యు అనూప్రోమన్ విచారించగా.. తాను 2015లో సిగ్మా ఆస్పత్రిలోనే లేనని.. తాను 2016లో ఆ ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. డాక్యూమెంట్స్ పై ఉన్న సంతకం కూడా తనది కాదని చెప్పాడు. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ వాదనకు రాలేదు. సమయం ఇచ్చినా వాదనలు వినిపించలేదు. దీంతో వినియోగదారుల కమిషన్ పై విధంగా తీర్పు ఇచ్చింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications