Inheritance Tax: ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత చేసిన ప్రతిపాదన యావత్ దేశాన్ని ఆలోచింప చేస్తోంది. పలువురు ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు తమదైన శైలిలో ఆ వ్యాఖ్యలకు అర్థం చెబుతున్నారు. అయితే అక్రమంగా, చట్టంలోని లొసుగులను ఉపయోగించి హద్దూ, అదుపూ లేకుండా సంపాదించిన బడాబాబులకు మాత్రం అవి రుచించడం లేదు.
అమెరికా తరహాలో వారసత్వపు పన్ను విధించడాన్ని భారత్ అనుసరించాలని కాంగ్రెస్ నాయకులు శామ్ పిట్రోడా ఇటీవల సూచించారు. ఇలా చేస్తే ఇక్కడి సూపర్ రిచ్ తమ వ్యాపారాలను ఇతర దేశాలకు తరలించే అవకాశం ఉందని ప్రముఖ రాజకీయ, ఆర్థికవేత్త మరియు రచయిత గౌతమ్ సేన్ అభిప్రాయపడ్డారు. పన్నుపోటు నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ వంటి దేశాలకు వలస వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు.

అంబానీ, అదానీ, మహీంద్రా మరియు టాటాలు వంటి దాదాపు 500 మంది అత్యంత సంపన్నులు దేశం దాటితే భారత్కు గణనీయమైన నష్టం వాటిల్లుతుందని ఆయన వివరించారు. వారందరూ దుబాయ్ వంటి ఆదాయపు పన్ను లేని ప్రాంతాలకు వలస వెళ్లిపోవచ్చన్నారు. అక్కడ తిరిగి తమ బిజినెస్ మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ విషయంలో స్వీడన్ను ఉదాహరణగా తీసుకోవచ్చని సేన్ తెలిపారు. వారసత్వ పన్ను విధించి ఒకానొక సమయంలో ప్రపంచంలోనే అత్యధిక ట్యాక్స్ కలెక్ట్ చేసినట్లు గుర్తు చేశారు. దీంతో చాలా మంది ధనికులు పారిపోతున్నందున తిరిగి ఆ పన్నును రద్దు చేసిందన్నారు. ఐకియా అధినేత కూడా అక్కడి నుంచి వలసవచ్చారని వివరించారు. తిరిగి ఎప్పుడైతే సంపద పన్ను రద్దు చేశారో అప్పుడు ఆ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్లు చెప్పారు. భారత్ విషయంలోనూ అలాగే జరుగుతుందని హెచ్చరించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications