బోర్డు నుంచి తప్పుకున్న కాగ్నిజెంట్ వైస్ చైర్మన్, వ్యవస్థాపకులు డిసౌజా, బ్రిటానియా వినితా బాలి ఇన్
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సహ వ్యవస్థాపకులు, వైస్ చైర్మన్ ఫ్రాన్సిస్కో డిసౌజా ఆ కంపెనీ బోర్డు నుంచి వైదొలిగారు. ఈ మేరకు ప్రకటన చేశారు. ఆయన బోర్డు నుంచి తొలగడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. తొలిసారి కంపెనీ సీఈవోగా బయటి వ్యక్తి బ్రెయిన్ హంప్రీస్ను తీసుకు వచ్చిన ఏడాది తర్వాత డిసౌజా తప్పుకుంటున్నారు.
2007 నుంచి 2019 మార్చి వరకు కాగ్నిజెంట్ సీఈవోగా డిసౌజా ఉన్నారు. అనంతరం ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు బ్రెయిన్ సీఈవోగా నియమితులయ్యారు. బ్రెయిన్ 2007 జనవరిలో కంపెనీ బోర్డులోకి వచ్చారు. 2018 జూన్ నుంచి వైస్ చైర్మన్గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనంతరం సీఈవోగా నియమితులయ్యారు.
కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్గా బ్రిటానియా ఇండస్ట్రీస్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వినితా బాలి బోర్డులో చేరుతారు. 1994లో డిసౌజా కాగ్నిజెంట్ను స్థాపించిన వారిలోలో ఉన్నారు.