కాగ్నిజెంట్ ఇండియా సీఎండీగా రాజేషన్ నంబియార్
కాగ్నిజెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(ఇండియా-CMD)గా రాజేష్ నంబియార్ను నియమించినట్లు ప్రకటించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగాను చేరుస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 9వ తేదీ నుండి ఆయన నియామకం అమలులోకి రానుంది. ప్రస్తుతం ఆయన నెట్ వర్కింగ్, సిస్టమ్స్ అండ్ సాఫ్టువేర్ కంపెనీ సియేనా ఇండియా చైర్మన్గా ఉన్నారు.
భారత్ కంపెనీ కార్యకలాపాలను, ప్రభుత్వం, వినియోగదారులతో సంబంధాల్ని మరింత బలోపేతం చేసేందుకు రాజేష్ కృషి చేయనున్నారని సంస్థ సీఈవో బ్రియాన్ హాంప్షైర్స్ అభిప్రాయపడ్డారు. కస్టమర్లకు అనుగుణంగా, ఐటీ పరిశ్రమలో మేటి సంస్థగా, నిత్య జీవితాన్ని మరింత మెరుగుపరిచే విధంగా కాగ్నిజెంట్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారన్నారు.
భారత్పై అందులో పట్టుకోసం అమెజాన్ జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ సై! అందుకే ఈ టగ్ ఆఫ్ వార్
కాగా, కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామ్కుమార్ రామమూర్తి తన పదవులకు కొద్ది నెలల క్రితం రాజీనామా చేశారు. ఈ మేరకు కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంప్రీస్ ఉద్యోగులకు జులై 10న వెల్లడించారు. రామ్ కుమార్ కాగ్నిజెంట్ కంపెనీలో సుమారు 23ఏళ్లపాటు పనిచేశారు. రామ్ కుమార్ సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని సీఈవో బ్రియాన్ నాడు ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.