Cognizant News: గత కొంత కాలంలో దేశీయ ఐటీ రంగంలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కంపెనీ గురించి వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి అనేక ప్రముఖ టాప్ టెక్ కంపెనీల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగులు తమ రాజీనామా తర్వాత కాగ్నిజెంట్ లో చేరటం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాగ్నిజెంట్ ఇండియా సీఈవో రాజేష్ నంబియార్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. గత నాలుగేళ్లుగా కాగ్నిజెంట్ ఇండియా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన రాజీనామా చేయటం చాలా మందిని ఒక్కసారిగా షాక్ కి గురిచేసిందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో హెచ్సీఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాజేష్ నంబియార్ రాజీనామా స్థానాన్ని రాజేష్ వారియర్ అక్టోబర్ 1 నుంచి భర్తీ చేయనున్నట్లు కాగ్నిజెంట్ ఇండియా ప్రకటించింది. ఆయన కాగ్నిజెంట్ గ్లోబల్ ప్రాసెస్ హెడ్గా కూడా వ్యవహరిస్తారు. కాగ్నిజెంట్లో చేరడానికి ముందర వారియర్ ఇన్ఫోసిస్ అమెరికాకు హెడ్గా పనిచేశారు.

కాగ్నిజెంట్ నుంచి వైదొలిగిన రాజేష్ నంబియార్ త్వరలో ఐటీ ఉద్యోగుల అత్యున్నత సంస్థ నాస్కామ్ అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. NASSCOM అనేది 1988లో స్థాపించబడిన సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీల జాతీయ సంఘం. భారతదేశంలో ఐటీ, వ్యాపార ప్రక్రియ రంగాల అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది. దేపజానీ ఘోష్ పదవీ విరమణ చేసిన తర్వాత ఇప్పుడు రాజేష్ నంబియార్ నాస్కామ్ చైర్మన్గా ఎంపికయ్యారు. దీంతో ఆయన 50 బిలియన్ డాలర్ల నాస్కామ్కు సారథ్యం వహించనున్నారు. ప్రస్తుతం దాని సభ్యుడిగా ఉన్న నంబియార్ త్వరలో దాని అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
వాస్తవానికి రాజేష్ నంబియార్ 2020లో కాగ్నిజెంట్ ఇండియాలో చేరారు. ఆ తర్వాత ఆయనకు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు ఆయన జియోన్ ఇండియా ఛైర్మన్గా ఉన్నారు. అంతకు ముందు ఆయన ప్రఖ్యాత అమెరికన్ టెక్ సంస్థ ఐబీఎమ్ కంపెనీలో అప్లికేషన్స్ సర్వీసెస్ విభాగంలో పనిచేశారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications