IT News: చాలా కాలంగా దేశీయ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులతో పాటు బోనస్ ప్రకటన గురించి కీలక సమాచారాన్ని అధికారికంగా పంచుకుంటున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగులకు వీటికి సంబంధించిన వివరాలను షేర్ చేశాయి. ఈ క్రమంలోనే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ కూడా తమ ఉద్యోగులకు వీటికి సంబంధించిన విషయాలపై కీలక సమాచారం అందించిందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. టెక్ మేజర్ కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో సంస్థ ఉద్యోగులకు బోనస్, ఆలస్యం అయిన జీతాల పెంపుల పత్రాల గురించి ఉద్యోగులతో మాట్లాడారు. వాస్తవానికి ఇది ఉద్యోగుల ఆందోళనలను పరిష్కరించడానికి, సంస్థ పరిహారం ప్రణాళికలపై స్పష్టత ఇవ్వడానికి ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ సమావేశంలో సీఈవో ఉద్యోగుల ఆందోళనలను అంగీకరించారు. ముఖ్యంగా వేతన పెంపులపై మాట్లాడుతూ.. వాస్తవానికి వీటిన ఏప్రిల్లో జరగాలని నిర్ణయించబడినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల ఆగస్ట్ వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలస్యానికి కారణాన్ని వివరిస్తూ.. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులతో సరిగ్గా సరిపోలడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయమని చెప్పుకొచ్చారు. అయితే సంస్థ హామీ ఇచ్చిన పెంపులను గౌరవించడంలో నిబద్ధత ఉందని, అయితే ఇది కొంత మేరకు ఆలస్యంగా జరుగుతోందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో సీఈవో రవి కుమార్ బోనస్ నిర్మాణంపై కూడా కీలక కామెంట్స్ చేశారు. కంపెనీ అర్హత గల ఉద్యోగులు తమ బోనస్లను ప్రణాళిక ప్రకారం అందుకుంటారని తెలిపారు. సమయానికిగాను చెల్లింపులు జరిపేందుకు కృషి చేస్తున్నట్లు ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మా ఉద్యోగులు వారి కష్టపడి పని చేసినదానికి తగినంత న్యాయం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ ఈ మార్చి నెలలో బోనస్లు అందజేయనున్నది. ఈ బోనస్ లు పొందడానికి అర్హులైన ఉద్యోగులు మార్చి 10 నాటికి బోనస్ లెటర్స్ మెయిల్ ద్వారా పొందుతారని స్పష్టం చేశారు. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కంపెనీ వృద్ధి, ఆవిష్కరణల పై దృష్టిని తప్పించటం లేదని వెల్లడించారు.
కంపెనీ ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తు విజయాలను సాధించటానికి ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి రంగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టడంపై నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు. దీని ప్రకారం ఉద్యోగులకు వేతన పెంపులు మరింత ఆలస్యాన్ని సూచిస్తున్నాయి. ఇది ఉద్యోగుల మోటివేషన్ దెబ్బతీస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
More From GoodReturns

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications