Telangana: రైతన్నకు శుభవార్త.. రైతుభరోసాపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

Rythu Bharosa: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. చాలా కాలంగా రైతు భరోసా డబ్బు కోసం నిరీక్షిస్తున్న కోట్ల మంది అన్నదాతలకు సీఎం ప్రకటన పెద్ద ఊరటను కలిగించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కో రైతు ఖాతాలో రూ.15 వేలు వేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి విధివిధానాలపై అసెంబ్లీలో చర్చించనున్నట్లు రేవంత్ ప్రకటించారు.

జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత రైతులకు హామీ ఇచ్చినట్లుగానే రైతు భరోసా సొమ్మును అన్నదాతల ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. ఎవరు అడ్డుపడినా రైతు భరోసా కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మెుద్దని, అనుమానాలు అస్సలు పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని, కమిటీ ఇచ్చిన నివేదికను శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిపారు. ఈలోపు మారీచుడు వంటి రాక్షసులు చెప్పే తప్పుడు మాటలను ప్రజలు నమ్మెుద్దని ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు.

CM Revanth Reddy announced good news over Rythu Bharosa funds release after Sankranti

వాస్తవానికి గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో రైతులకు రూ.10,000 చొప్పున సాయం అందించిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు స్కీమ్ కింద రూ.5000 ఇస్తూ వచ్చింది. కానీ పథకంలో అక్రమాలు ఉన్నాయని పేర్కొంటూ రేవంత్ సర్కార్ స్కీమును పూర్తిగా ఆపివేయటంతో రైతన్నల్లో ఆందోళన పట్టుకుంది. దీని స్థానంలో రైతు భరోసా స్కీమ్ తెస్తామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం అందుకోసం సర్వేలు కూడా చేసింది. అయితే చాలా కాలం గడుస్తున్నా స్కీముపై క్లారిటీ లేకపోవటంతో రైతన్నలతో పాటు అటు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రభుత్వంపై దాడి మెుదలైంది. పంట సీజన్లు మారుతున్నా పథకంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవటం చాలా మందిని నిరాశకు గురిచేసింది. దీంతో నేడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డీ దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.

తెలంగాణ వ్యాప్తంగా వరి సన్నాలు పండిస్తే రైతులకు బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. ఈ సన్నాలను రాష్ట్రంలోని హాస్టల్స్ కే వినియోగిస్తామని అన్నారు. తాము ప్రకటించిన విధంగా నిర్దిష్ట సమయంలో రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న 25 లక్షల మంది రైతులకు రుణ మాఫీ అమలు చేసామని, సాంకేతిక కారణాల కారణంగా నిలిచిపోయిన వారికి కూడా దీనిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రైతులకు వెన్నుగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం హామీ ఇచ్చారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+